Homeఆంధప్రదేశ్YS Jagan | నాంపల్లి కోర్టులో ముగిసిన వైఎస్​ జగన్​ విచారణ

YS Jagan | నాంపల్లి కోర్టులో ముగిసిన వైఎస్​ జగన్​ విచారణ

ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్ విచారణ నిమిత్తం గురువారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. అనంతరం లోటస్​పాండ్​లోని తన నివాసానికి వెళ్లారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ విచారణ నాంపల్లి కోర్టులో ముగిసింది. గురువారం విచారణ ఉండటంతో ఆయన హైదరాబాద్​ (Hyderabad)కు చేరుకున్న విషయం తెలిసిందే. బేగంపేట ఎయిర్పోర్టులో వైసీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్​ నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరయ్యారు.

అక్రమాస్తుల కేసులో జగన్​ బెయిల్​పై ఉన్న విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో ప్రత్యక్షంగా హాజరు కావాలని సీబీఐ (CBI) గతంలో వాదించింది. దీంతో ఈ నెల 21లోపు స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో గురువారం ఆయన కోర్టుకు వచ్చారు. అయితే 5 నిమిషాలు మాత్రమే కోర్టులో ఉన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా.. సీబీఐ వ్యతిరేకించింది. కాగా ఆయన హాజరైనట్లు రికార్డులో నమోదు చేశారు. అనంతరం విచారణ ముగిసింది.

YS Jagan | లోటస్​ పాండ్​లో ఉద్రిక్తత

విచారణ అనంతరం జగన్ బంజారాహిల్స్‌ (Banjara Hills)లోని లోటస్ పాండ్‌ వద్ద తన నివాసానికి చేరుకున్నారు. జగన్​ వస్తున్నారని తెలుసుకొని ఆయన ఇంటి వద్ద భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఒక్కసారిగా జగన్ (YS Jagan) ఇంటి వద్దకు అభిమానులు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్​ వాహనాన్ని అభిమానులు చుట్టుముట్టడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకి అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ జగన్ లోపలికి వెళ్లిపోయారు.