YS Jagan | నాంపల్లి కోర్టులో ముగిసిన వైఎస్​ జగన్​ విచారణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ విచారణ నాంపల్లి కోర్టులో ముగిసింది. గురువారం విచారణ ఉండటంతో ఆయన హైదరాబాద్​ (Hyderabad)కు చేరుకున్న విషయం తెలిసిందే. బేగంపేట ఎయిర్పోర్టులో వైసీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్​ నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్​ బెయిల్​పై ఉన్న విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో ప్రత్యక్షంగా హాజరు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ విచారణ నాంపల్లి కోర్టులో ముగిసింది. గురువారం విచారణ ఉండటంతో ఆయన హైదరాబాద్​ (Hyderabad)కు చేరుకున్న విషయం తెలిసిందే. బేగంపేట ఎయిర్పోర్టులో వైసీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్​ నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరయ్యారు.

అక్రమాస్తుల కేసులో జగన్​ బెయిల్​పై ఉన్న విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో ప్రత్యక్షంగా హాజరు కావాలని సీబీఐ (CBI) గతంలో వాదించింది. దీంతో ఈ నెల 21లోపు స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో గురువారం ఆయన కోర్టుకు వచ్చారు. అయితే 5 నిమిషాలు మాత్రమే కోర్టులో ఉన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా.. సీబీఐ వ్యతిరేకించింది. కాగా ఆయన హాజరైనట్లు రికార్డులో నమోదు చేశారు. అనంతరం విచారణ ముగిసింది.

YS Jagan | లోటస్​ పాండ్​లో ఉద్రిక్తత

విచారణ అనంతరం జగన్ బంజారాహిల్స్‌ (Banjara Hills)లోని లోటస్ పాండ్‌ వద్ద తన నివాసానికి చేరుకున్నారు. జగన్​ వస్తున్నారని తెలుసుకొని ఆయన ఇంటి వద్ద భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఒక్కసారిగా జగన్ (YS Jagan) ఇంటి వద్దకు అభిమానులు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్​ వాహనాన్ని అభిమానులు చుట్టుముట్టడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకి అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ జగన్ లోపలికి వెళ్లిపోయారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.