అక్షరటుడే, వెబ్డెస్క్: Kharge Jaggareddy Meeting | కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల గురించి ఆయనతో చర్చించారు.
రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్నేత అభిషేక్ సింగ్ మన్వీ, బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్రెడ్డి పదవీ కాలం కానుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పలువురు రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్నారు. అయితే ఒకస్థానాన్ని అభిషేక్ సింగ్కు కేటాయించనట్లు సమాచారం. దీంతో మరో స్థానానికి తీవ్ర పోటీ ఉంది. ఈ క్రమంలో జగ్గారెడ్డి మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)తో చర్చించారు.
Kharge Jaggareddy Meeting | వారికి అవకాశం ఇవ్వాలి
తెలంగాణ (Telangana)లో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాల గురించి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జీ మీనాక్షి నాటరాజన్తో చర్చించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా ఖర్గేను కలిశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్కు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని సైతం ఆయన కలవాలని ఢిల్లీ వెళ్లారు. అయితే రాహుల్ బిజీగా ఉండటంతో కలువలేకపోయారు.
మల్లికార్జున ఖర్గేను కలిసి వి హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని కోరారు. జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్, స్టూడెంట్ లీడర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని వివరించారు. హనుమంతరావు తెలంగాణలో అనేక ముఖ్యమంత్రులతో పని చేశారని, మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ , సోనియాగాంధీ ఆయనకు అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. కమిటీలో చర్చిస్తామని ఖర్గే హామీ ఇచ్చినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
