Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | చోరీలకు పాల్పడిన మహిళ అరెస్ట్

Nizamabad City | చోరీలకు పాల్పడిన మహిళ అరెస్ట్

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వన్​ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు వన్​ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (One Town SHO Raghupathi) తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

గతంలో ఇంట్లో నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు పోవడంతో కుమార్​గల్లీకి చెందిన ఇంటి యజమాని గంగా కిషన్ తన ఇంట్లో సీక్రెట్ కెమెరాను అమర్చుకున్నారు. ఈనెల 13న ఇంటి బెడ్​ రూం​లోని సేఫ్ లాకర్​లో (safe locker) బంగారం, వెండి, కొంత డబ్బులు పెట్టి గంగాకిషన్​ తదితరులు బయటకు వెళ్లారు. ఈనెల 19న ఆ బంగారం కోసం చూడగా కనిపించలేదు.

అనుమానంతో సీసీ కెమెరాలు (CCTV cameras) పరిశీలించగా.. వారి ఇంటి ఫస్ట్ ఫ్లోర్​లో పనిచేసే గాయత్రి అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో డుబ్లికేట్​ తాళంతో ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో ఉన్న బంగారం, వెండి నగదును దొంగిలించుకుని పోయినట్టుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు హారిక అలియాస్​ గాయత్రి (37) అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన నేరాన్ని ఆమె ఒప్పుకుంది. అనంతరం ఆమె వద్ద నుంచి 8 తులాల బంగారం 1300 గ్రాముల వెండి రూ.50 వేల స్వాధీనం చేసుకొన్నారు. గాయత్రిని రిమాండ్​కు తరలించినట్లు ఎస్​హెచ్​వో రఘుపతి పేర్కొన్నారు.