Nizamabad City | చోరీలకు పాల్పడిన మహిళ అరెస్ట్

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు వన్​ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (One Town SHO Raghupathi) తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గతంలో ఇంట్లో నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు పోవడంతో కుమార్​గల్లీకి చెందిన ఇంటి యజమాని గంగా కిషన్ తన ఇంట్లో సీక్రెట్ కెమెరాను అమర్చుకున్నారు. ఈనెల 13న ఇంటి బెడ్​ రూం​లోని సేఫ్ లాకర్​లో (safe […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు వన్​ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (One Town SHO Raghupathi) తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

గతంలో ఇంట్లో నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు పోవడంతో కుమార్​గల్లీకి చెందిన ఇంటి యజమాని గంగా కిషన్ తన ఇంట్లో సీక్రెట్ కెమెరాను అమర్చుకున్నారు. ఈనెల 13న ఇంటి బెడ్​ రూం​లోని సేఫ్ లాకర్​లో (safe locker) బంగారం, వెండి, కొంత డబ్బులు పెట్టి గంగాకిషన్​ తదితరులు బయటకు వెళ్లారు. ఈనెల 19న ఆ బంగారం కోసం చూడగా కనిపించలేదు.

అనుమానంతో సీసీ కెమెరాలు (CCTV cameras) పరిశీలించగా.. వారి ఇంటి ఫస్ట్ ఫ్లోర్​లో పనిచేసే గాయత్రి అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో డుబ్లికేట్​ తాళంతో ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో ఉన్న బంగారం, వెండి నగదును దొంగిలించుకుని పోయినట్టుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు హారిక అలియాస్​ గాయత్రి (37) అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన నేరాన్ని ఆమె ఒప్పుకుంది. అనంతరం ఆమె వద్ద నుంచి 8 తులాల బంగారం 1300 గ్రాముల వెండి రూ.50 వేల స్వాధీనం చేసుకొన్నారు. గాయత్రిని రిమాండ్​కు తరలించినట్లు ఎస్​హెచ్​వో రఘుపతి పేర్కొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.