అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ సమర్పించింది. హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించడం కేటీఆర్ సొంత నిర్ణయమని పేర్కొంది.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ–రేసు (Formula E Race) నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏసీబీ విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన ఏసీబీ తుది నివేదికను తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేటు డిస్కషన్లతో రేస్ నిర్వహించినట్లు ఏసీబీ తెలిపింది. ఈ కేసులో ఏ1 మాజీ మంత్రి కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్, ఏ3 BLN రెడ్డి, ఏ4, ఏ5గా FEO ప్రతినిధులను చేర్చారు.
KTR | బీఆర్ఎస్కు రూ.44 కోట్లు
అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించడంతో క్విడ్ ప్రో కో జరిగిందని వివరించారు. దీంట్లో భాగంగా బీఆర్ఎస్కి రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు అందాయని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ట్రై పార్టీ అగ్రిమెంట్కి ముందే ఎలక్ట్రోరల్ బాండ్స్ (Electoral Bonds) చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. రేసు నిర్వహణ కోసం గవర్నర్ సంతకం లేకుండానే ఐఏఎస్ అధికారి అరవింద్ (IAS Officer Arvind) రెండు ఒప్పందాలపై సంతకం చేశారని చేశారని పేర్కొన్నారు. ఈ రేసు కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 166(1), 299 నిబంధనలను ఉల్లంఘించారని వెల్లడించారు.
KTR | గవర్నర్ అనుమతి
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏసీబీ అధికారులు (ACB Officers) కేటీఆర్ పేరు చేర్చారు. ఇప్పటికే ఆయనను నాలుగు సార్లు విచారించారు. కేటీఆర్ (KTR) ప్రాసిక్యూషన్కు ఇటీవల గవర్నర్ సైతం ఆమోదించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తామని పలువురు మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ ఇంత వరకు ఒక్క కేసు ముందుకు సాగలేదు. కాళేశ్వరం అంశం సీబీఐకి చేరింది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసు కేసుల్లో విచారణ ఏళ్లుగా సాగుతోంది. అయితే తాజాగా గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
