HomeజాతీయంWest Bengal | నీళ్ల బదులుగా వంట‌కి వాడిన యాసిడ్.. ఆరుగురు కుటుంబ సభ్యులు తీవ్ర...

West Bengal | నీళ్ల బదులుగా వంట‌కి వాడిన యాసిడ్.. ఆరుగురు కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థత

ఒక్కోసారి మ‌నం నిర్ల‌క్ష్యంగా ఉండ‌డం ప్రాణాల‌కే ముప్పుగా మారుతుంది. రీసెంట్‌గా పశ్చిమ బెంగాల్‌లో వంట కోసం నీళ్ల‌కి బ‌దులు యాసిడ్ వాడ‌డంతో వారి ప‌రిస్థితి దారుణంగా మారింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : West Bengal | పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వంట చేసే సమయంలో నీళ్లకు బదులుగా పొరపాటున యాసిడ్‌ను ఉపయోగించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు.

బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదం పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా (Midnapore District), రత్నేశ్వర్‌బతి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సంతు అనే వ్యక్తి వెండి పరికరాల శుభ్రపరచే పనులు చేస్తుంటాడు. తన పనిలో భాగంగా వెండి శుభ్రపరిచే యాసిడ్‌ను ఒక సాధారణ కంటైనర్‌లో నిల్వ ఉంచాడు.

West Bengal | చిన్న త‌ప్పు..

ఆ పాత్ర నీళ్లు నింపే బాటిల్స్‌లా కనిపించడం వల్లే పెద్ద తప్పు జరిగింది. ఆదివారం మధ్యాహ్నం సంతు కుటుంబానికి చెందిన ఓ మహిళ వంట చేస్తుండగా, నీళ్లు అనుకుని అదే యాసిడ్ ఉన్న పాత్రను ఆహార తయారీలో ఉపయోగించింది. ఆ ఆహారం తిన్న వెంటనే కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, శ్వాస సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే వారిని సమీపంలోని ఘటల్ ఆసుపత్రి (Ghatal Hospital)కి తరలించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత, ఆహారంలో యాసిడ్ కలిసినందునే ఈ తీవ్ర ప్రతిక్రియలు కలిగాయని నిర్ధారించారు. ప్ర‌థ‌మ చికిత్స చేసినప్పటికీ, ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటనే ఆరుగురినీ మెరుగైన వైద్యం కోసం కోల్‌కతాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఒక చిన్న పొరపాటు ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసిన ఘటనపై గ్రామంలో ఆందోళన నెలకొంది. వెండి పనుల్లో యాసిడ్‌ను ఇంట్లో నిల్వ ఉంచే ప్రమాదాలపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల ప్రకారం, యాసిడ్ పరిమాణం (Acid Quantity) ఎంత మేరకు ఆహారంలో కలిసి ఉందనేదే వారి ఆరోగ్యపరిస్థితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆరుగురినీ పరిశీలిస్తోంది. సాధారణ నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదాన్ని సృష్టించగలదనే విషయం ఈ ఘటన మరొకసారి నిరూపించింది. సంతు కుటుంబానికి జరిగిన ఈ విషాదం గ్రామాన్ని షాక్‌కు గురి చేసింది. కోల్‌కతా ఆసుపత్రి (Kolkata Hospital) లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.