AP CM Chandrababu | కాళేశ్వరం ప్రాజెక్ట్​కు అడ్డు చెప్పలేదు : ఏపీ సీఎం చంద్రబాబు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP CM Chandrababu | రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మిస్తే తాము అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే సహకారంతో రెండు రాష్ట్రాలు ముందుకు సాగాలని సూచించారు. మంత్రులు, అధికారులతో చంద్రబాబు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. పాస్ పుస్తకాల పంపిణీ, రిజిస్ట్రేషన్ సేవలు, పీపీపీ విధానంపై రివ్యూ చేశారు. 2026-27 బడ్జెట్ పైనా చర్చించారు. ఈ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP CM Chandrababu | రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మిస్తే తాము అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే సహకారంతో రెండు రాష్ట్రాలు ముందుకు సాగాలని సూచించారు.

మంత్రులు, అధికారులతో చంద్రబాబు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. పాస్ పుస్తకాల పంపిణీ, రిజిస్ట్రేషన్ సేవలు, పీపీపీ విధానంపై రివ్యూ చేశారు. 2026-27 బడ్జెట్ పైనా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జూన్ నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణాకు గోదావరి నీళ్లు తెస్తామన్నారు.

AP CM Chandrababu | పోలవరం పూర్తయితే..

పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) 67 శాతం పూర్తయిందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. మనమే ఇతర రాష్ట్రాలకు నీళ్లిచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను ఆయన ప్రశంసించారు. భూ సేకరణకు రైతులు ముందుకు వచ్చారని చెప్పారు. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యం చేశామన్నారు. కేంద్రం సహకారంతో రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.