Hyderabad | తాగునీటితో కారు వాష్​.. రూ.10 వేల ఫైన్​ వేసిన అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో తాగునీటి కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. సరిపడ నీళ్లు రాక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా బస్తీల్లో ఉండేవారు ఎక్కువగా నీటి కోసం తిప్పలు పడుతుంటారు. నగరంలో జల మండలి (Jala Mandali) ఆధ్వర్యంలో నిత్యం తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఉచితంగా సరఫరా చేసే ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తారు. ఎంతో మంది నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, దుర్వినియోగం చేయొద్దని అవగాహన కల్పిస్తుంటారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో తాగునీటి కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. సరిపడ నీళ్లు రాక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా బస్తీల్లో ఉండేవారు ఎక్కువగా నీటి కోసం తిప్పలు పడుతుంటారు.

నగరంలో జల మండలి (Jala Mandali) ఆధ్వర్యంలో నిత్యం తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఉచితంగా సరఫరా చేసే ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తారు. ఎంతో మంది నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, దుర్వినియోగం చేయొద్దని అవగాహన కల్పిస్తుంటారు. అయినా కూడా కొందరు జల మండలి(HMWS SB) సరఫరా చేసే నీటిని వృథా చేస్తున్నారు. అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తికి రూ.పది వేల జరిమానా వేశారు.

Hyderabad | కారు కడగడంతో..

బంజారాహిల్స్ (Banjara Hills)​ రోడ్​ నంబర్​ 12లో ఓ వ్యక్తి తన మెర్సిడెస్​ జీ వాగన్​ కారును జలమండలి సరఫరా చేసే తాగునీటితో కడుగుతున్నాడు. అటుగా వెళ్తున్న వాటర్​ బోర్డు ఎండీ అశోక్​ దీనిని గమనించాడు. వెంటనే అతడిని ఆపారు. అంతేగాకుండా రూ.పది వేల ఫైన్​ వేశారు. తాగునీటిని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Hyderabad | నీటి సరఫరాకు అంతరాయం

నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్-1,2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే బ‌ల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్​ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చడానికి చర్యలు చేపట్టారు. దీంతో నగరంలోని చార్మినార్, వినయ్ నగర్, బొజగుట్ట, రెడ్ హిల్స్, నారాయణ గూడ, మారేడ్​పల్లి, ఎస్ఆర్ నగర్, కూకట్​పల్లి, రియాసత్​ నగర్​, సాహెబ్ నగర్, హయత్ నగర్, సైనిక్ పురి, ఉప్పల్, హఫీజ్​పేట్, రాజేంద్ర నగర్, మణికొండ, బోడుప్పల్, మీర్ పేట్ డివిజన్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.