Kammarpally | తాగునీటి కోసం గ్రామ పంచాయతీ ముట్టడి

అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpally | కమ్మర్​ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని (Kammarpalli panchayat office) ఎస్సీ, బీసీ కాలనీ వాసులు సోమవారం ముట్టడించారు. ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి నీటి సమస్యతో (water problems) ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంపీడీవో రాజ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున వచ్చి మిషన్ […]

అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpally | కమ్మర్​ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని (Kammarpalli panchayat office) ఎస్సీ, బీసీ కాలనీ వాసులు సోమవారం ముట్టడించారు. ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి నీటి సమస్యతో (water problems) ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా ఎంపీడీవో రాజ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున వచ్చి మిషన్ భగీరథ ఏఈని పిలిపించి నీటి సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. అప్పటి వరకు ట్యాంకర్​తో నీటి సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నీటి సమస్యను త్వరగా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాలనీ హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.