HomeతెలంగాణUrea | రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి.. ఎందుకంటే..!

Urea | రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి.. ఎందుకంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea : తెలంగాణ(Telangana)తో పాటు ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) కర్షకులకు ఎరువుల తిప్పలు తప్పేలా కనబడడం లేదు. పంట సాగు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడబోతోంది. ఎందుకంటే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ Peddapalli fertilizer factory తాత్కాలికంగా మూతబడింది.

Urea : కారణం అదే..

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (Ramagundam Fertilizers and Chemicals Limited – RFCL) ప్లాంట్​లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా యూరియా ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఈ పరిశ్రమలో ఆమోనియా సరఫరా అయ్యే ఎల్బో పైపులలో లీకేజీ ఏర్పడింది. ఫలితంగా ఫ్యాక్టరీని పక్షం రోజులపాటు మూసివేయాలని యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

Urea : సుమారు 50 వేల మెట్రిక్​ టన్నులు..

ప్లాంట్​లో ఏర్పడిన పైపుల లీకేజీని సరిచేసేందుకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో పరిశ్రమను 15 రోజులపాటు మూసివేయనున్నారు. ఇలా మూసివేయడం వల్ల దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ప్రొడక్షన్​ ఆగిపోనుంది. దీని ప్రభావం ఉభయ రాష్ట్రాల రైతులపై భారీగానే పడనుంది.

Urea : ఇప్పటికే లోటు..

తెలంగాణ రాష్ట్రానికి నెలకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ, జులైలో కేవలం 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించడం గమనార్హం. తాజాగా రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతతో రైతులకు మరింత ప్రభావం ఉండబోతోంది.

Must Read
Related News