TVK Chief Vijay | సీబీఐ విచారణకు హాజరుకానున్న టీవీకే చీఫ్​ విజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVK Chief Vijay | తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్​ (TVK party chief Vijay) నేడు సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఆయన చెన్నై నుంచి ఢిల్లీ బయలు దేరారు. కరూర్​ తొక్కిఘటనపై విచారణకు హాజరుకావాలని విజయ్‌కు ఆరు రోజుల క్రితం సీబీఐ సమన్లు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్లో కరూర్ ర్యాలీలో 41మంది ప్రాణాలు కోల్పోవడంపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తును (CBI investigation) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVK Chief Vijay | తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్​ (TVK party chief Vijay) నేడు సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఆయన చెన్నై నుంచి ఢిల్లీ బయలు దేరారు.

కరూర్​ తొక్కిఘటనపై విచారణకు హాజరుకావాలని విజయ్‌కు ఆరు రోజుల క్రితం సీబీఐ సమన్లు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్లో కరూర్ ర్యాలీలో 41మంది ప్రాణాలు కోల్పోవడంపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తును (CBI investigation) పర్యవేక్షించేందుకు ముగ్గరు సభ్యుల కమిటీని న్యాయస్థానం నియమించింది. సోమవారం సాయంత్రం ఆయనను అధికారులు విచారించనున్నారు.

TVK Chief Vijay | 41 మంది మృతి

తమిళనాడులోని (Tamil Nadu) కరూర్ జిల్లాలో తొక్కిసలాటలో 41 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాట దర్యాప్తుకు సంబంధించి జనవరి 6న సీబీఐ విజయ్​కు సమన్లు ​​జారీ చేసింది. అంతకుముందు ఈ కేసు విచారణకు సంబంధించి టీవీకే కార్యనిర్వాహకులను ప్రశ్నించింది. కాగా సెప్టెంబర్​ 27న ర్యాలీకి విజయ్​ ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని తమిళనాడు పోలీసులు తెలిపారు. పది వేల మంది వస్తారని అనుమతి తీసుకొగా.. మూడు రెట్లు ఎక్కువగా వచ్చారన్నారు. నిర్వాహకుల తీరుతోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కూడా టీవీకేపై తీవ్రంగా మండిపడింది, ఈ ఘటనను మానవ తప్పిదంతో జరిగిన ఒక పెద్ద విపత్తు అని పేర్కొంది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.