Homeతాజావార్తలుToday Gold Prices | మ‌ళ్లీ పసిడి ప‌రుగులు.. నేటి ధ‌ర‌ ఎంతంటే..!

Today Gold Prices | మ‌ళ్లీ పసిడి ప‌రుగులు.. నేటి ధ‌ర‌ ఎంతంటే..!

Today Gold Prices | బంగారం ధ‌ర‌లు ఈ మ‌ధ్య దోబూచులాడుతున్నాయి. ధ‌ర‌లు ఎప్పుడు ఎలా ఉంటాయ‌నేది చెప్ప‌డం క‌ష్టంగా మారింది. సామాన్యులు మాత్రం బంగారానికి కాస్త దూరంగానే ఉంటున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | గత వారం రోజులుగా ఎగబాకిన‌ బంగారం ధరలు Gold Price మ‌ధ్య‌లో కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. కానీ, మ‌ళ్లీ ఇప్పుడు మెల్ల‌గా ఎగ‌బాకుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటం, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటం వల్ల బంగారంపై డిమాండ్ తగ్గకుండా నిలకడగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో నవంబరు 18న దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెద్దగా మార్పుల్లేకుండా స్థిరంగానే ఉన్నాయి. ఈరోజు (నవంబరు 18) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,410కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,14,960గా నమోదైంది.

Today Gold Prices | మెల్ల‌మెల్ల‌గా పైపైకి..

భారత రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,25,560గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,15,110కి చేరింది.

  • హైదరాబాద్‌ Hyderabad , విజయవాడ, ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా ధరలు దాదాపు ఒకే స్థాయిలో నమోదయ్యాయి.
  • హైదరాబాద్, విజయవాడ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణె వంటి ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,410 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,960గా కొనసాగింది.
  • వడోదరలో మాత్రం స్వల్పంగా పెరిగి 24 క్యారెట్ల ధర రూ. 1,25,460కు, 22 క్యారెట్ల ధర రూ. 1,15,010కి చేరింది.

ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగాయి.

  • హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళల్లో Kerala కిలో వెండి ధర రూ. 1,72,900గా నిలిచింది.
  • ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో కిలో వెండి ధర రూ. 1,66,900గా నమోదైంది.

సమగ్రంగా పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్థిరమైన ట్రెండ్‌ను చూపుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేకమైన మార్పులు లేకపోవడం వల్ల రేట్లు ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.