అక్షరటుడే, వెబ్డెస్క్: Cold Wave | రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. నాలుగు రోజులుగా శీతల గాలులు తీవ్రంగా వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ (Telangana)లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి 5 వరకు చలి ప్రభావం తక్కువగా ఉంది. పొగమంచు మాత్రం కురిసింది. అయితే నాలుగు రోజులుగా చలి మళ్లీ పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు (Temperatures) రికార్డు స్థాయిలో పడిపోయాయి. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదు అవుతోంది. ఉదయం 10 గంటల వరకు చలి పెడుతోంది. సాయంత్రం 5 గంటలు దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి. మధ్యాహ్నం సైతం చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే మరో 36 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తర్వాత చలి కాస్తా తగ్గి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు.
Cold Wave | కనిష్ట ఉష్ణోగ్రతలు
శుక్రవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) కోహిర్లో 6.6 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో 7.1, రంగారెడ్డి ల్లా మొయినాబాద్లో 7.2, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 8.1, మర్పల్లే(వికారాబాద్) 8.2, భీమ్పూర్ (ఆదిలాబాద్) 8.3, గంభీరావుపేట (సిరిసిల్ల) 9.1, వెల్దుర్తి (మెదక్) 9.4, సాలూరా (నిజామాబాద్) 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.