The Raja Saab | రాజాసాబ్​ నిర్మాతకు హైకోర్టు షాక్​..

అక్షరటుడే, వెబ్​డెస్క్: The Raja Saab | రాజాసాబ్​ నిర్మాతకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్​ ఇచ్చింది. టికెట్‌ రేట్‌ (ticket price) పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్​ చేసింది. పాత ధరల ప్రకారమే టికెట్లు విక్రయించాలని ఆదేశించింది. ​ ప్రభాస్​ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్​ (The Raja Saab) శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్​ షోలతో పాటు, టికెట్​ ధరలు పెంచుకోవడానికి అనుమతించాలని నిర్మాత […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: The Raja Saab | రాజాసాబ్​ నిర్మాతకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్​ ఇచ్చింది. టికెట్‌ రేట్‌ (ticket price) పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్​ చేసింది. పాత ధరల ప్రకారమే టికెట్లు విక్రయించాలని ఆదేశించింది.

​ ప్రభాస్​ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్​ (The Raja Saab) శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్​ షోలతో పాటు, టికెట్​ ధరలు పెంచుకోవడానికి అనుమతించాలని నిర్మాత ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రీమియర్​ షోలకు అనుమతించని ప్రభుత్వం.. టికెట్​ రేట్లు పెంచుకోవడానికి మాత్రం అర్ధరాత్రి ఓకే చెప్పింది. తొలి మూడు రోజులు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 ధర పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్​లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 రేటు పెంచుకోవచ్చని చెప్పింది.

The Raja Saab | హైకోర్టు ఆగ్రహం

టికెట్​ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి కూడా చెప్పారని, అయినా పెంపునకు అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారని ప్రశ్నించింది. ఆ మెమోను సస్పెండ్​ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పాత రేట్లకే టికెట్లు విక్రయించాలని సూచించింది. ఇకపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. టికెట్‌ రేటు పెంచాలనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తెలిపింది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.