KTR | రియల్​ ఎస్టేట్​ బ్రోకర్​లా ప్రభుత్వ తీరు : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రియల్​ ఎస్టేట్​ బ్రోకర్​లా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో శుక్రవారం ఆయన సమావేశం అయ్యారు. హైదరాబాద్​ (Hyderabad)లోని ఉర్దూ యూనివర్సిటీకి చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తోందని కేటీఆర్​ అన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్​కు తలమానికంగా ఉన్న ఉర్దూ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రియల్​ ఎస్టేట్​ బ్రోకర్​లా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో శుక్రవారం ఆయన సమావేశం అయ్యారు.

హైదరాబాద్​ (Hyderabad)లోని ఉర్దూ యూనివర్సిటీకి చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తోందని కేటీఆర్​ అన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్​కు తలమానికంగా ఉన్న ఉర్దూ యూనివర్సిటీ (Urdu University)ని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వాడాలనుకుంటుంటోందని ఆరోపించారు. సీరియల్ కిల్లర్ల మాదిరి సీరియల్ ల్యాండ్ స్నాచర్​గా మారిందన్నారు.

KTR | వర్సిటీల భూములపై కన్ను

అన్ని యూనివర్సిటీ భూములను గుంజుకోవడం ఒక ప్రక్రియగా కాంగ్రెస్​ పెట్టుకుందన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు (High Court) పేరు చెప్పి తీసుకుందన్నారు. 400ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నం చేయగా.. కోర్టులు అడ్డుకున్నాయని తెలిపారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్ను వేసిందన్నారు. ఈ ప్రభుత్వం విద్యా సంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ (Real Estate Broker) మాదిరిగా వ్యవహరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు బీఆర్​ఎస్​ అండగా ఉంటుందన్నారు.

KTR | నోటిఫికేషన్లు వేయాలి

నిరుద్యోగులపై జరిగిన లాఠీఛార్జ్​ను కేటీఆర్ ఖండించారు. నోటిఫికేషన్లు ఏవి అని నిలదీసినందుకు వారిని దారుణంగా తిడుతూ ఘోరంగా లాఠీ ఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ఇప్పుడు మోసం చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశంపై స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయించాలని డిమాండ్​ చేశారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.