Homeతాజావార్తలుTelangana Pollution Control Board | కాలుష్య పరిశ్రమలపై టీజీపీసీబీ కొరఢా.. 305 ఇండస్ట్రీలకు షట్​డౌన్​...

Telangana Pollution Control Board | కాలుష్య పరిశ్రమలపై టీజీపీసీబీ కొరఢా.. 305 ఇండస్ట్రీలకు షట్​డౌన్​ ఆదేశాలు.. 1,234 యూనిట్లకు నోటీసులు జారీ..!

Telangana Pollution Control Board | 2024 జనవరి నుంచి 2025 అక్టోబరు వరకు తెలంగాణ వ్యాప్తంగా 305 పరిశ్రమలను పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు మూసివేసింది. మరో 1,234 యూనిట్లకు నోటీసులు జారీ చేయడం గమనార్హం.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana Pollution Control Board | తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య కారక పరిశ్రమలపై Telangana పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు (TGPCB) కొరఢా ఝలిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రమాణాలను ఉల్లంఘించిన ఎన్నో యూనిట్లను పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు హెచ్చరించి, కొన్నింటిని మూసివేసినట్లుగా తెలిసింది.

రాష్ట్రంలో మొత్తం 12,264 యూనిట్లు నమోదు కాగా.. అందులో 1,234 యూనిట్లకు పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు నోటీసులు జారీ చేసింది. వీటిలో 305 యూనిట్లకు షట్‌డౌన్ ఆదేశాలు జారీ అయ్యాయి.

కొత్తగా 2,620 పరిశ్రమలకు యూజ్-ఆపరేషన్ కన్సెంట్ ఇచ్చింది. 3,521 యూనిట్లు ఏర్పాటుకు అనుమతులు పొందాయి.

Telangana Pollution Control Board | కాలుష్య నమూనాల సేకరణ..

నేల, నీరు, గాలి కాలుష్యంపై పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు విస్తృతంగా చర్యలు తీసుకుంటోంది. దాదాపు 7,966 నీటి నమూనాలు, 3,807 గాలి ప్రమాణాల నమూనాలు తెలంగాణ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు సేకరించింది. కాలుష్యం వ్యాప్తి చేస్తున్న సుమారు 500 యూనిట్లపై ఆన్‌లైన్​లో మానిటరింగ్ చేస్తోంది.