ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pawan Kalyan | పవన్ కళ్యాణ్​కు షాక్​.. తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు

    Pawan Kalyan | పవన్ కళ్యాణ్​కు షాక్​.. తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, అమరావతి : Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Andhra Pradesh Deputy CM Pawan Kalyan)​కు తమిళనాడు Tamil Nadu పోలీసులు షాక్​ ఇచ్చారు. అక్కడి అన్నానగర్ పోలీస్ స్టేషన్‌ లో పవన్ పై కేసు నమోదు చేశారు. గత నెల(జూన్​ 22)లో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న పవన్ ఉద్వేగ పూరిత ప్రసంగంతో​ మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) మురుగన్​ భక్తుల సదస్సు(Murugan devotees’ conference)లో ద్వేషపూరిత ప్రసంగం చేశారనేది అభియోగం. దీనిపై అన్నామలై తో పాటు అనేక మంది నిర్వాహకులపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

    Pawan Kalyan : పలు సెక్షన్​ల కింద..

    పవన్​ కళ్యాణ్​పై మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ న్యాయవాది వంజినాథన్ ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. ఈమేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్​పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196(1)(ఏ), 299, 302, 353(1)(బి)(2)లను కేసులో తమిళనాడు​ పోలీసులు పొందుపర్చారు.

    మురుగన్​ భక్తుల సదస్సులో చేసిన ప్రసంగాలు, తీర్మానాలు.. జాతి, మతం, ప్రాంత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేవిగా, సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎఫ్ఐఆర్​లో పొందుపర్చినట్లు తెలుస్తోంది.

    Pawan Kalyan : పవన్​ కళ్యాణ్​ ప్రసంగాన్ని ఓసారి పరిశీలిస్తే…

    ఈ సదస్సులో హిందువులు ఒక కూటమిగా ఓటు వేయాలని కోరారు. ఆలయాలను ఆదాయ వనరులుగా పరిగణిస్తున్నందుకు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొన్ని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై పవన్ ప్రసంగిస్తూ… హిందువుల్ని నిలదేసే వారికి అరేబియా నుంచి వచ్చిన మతాల్ని ప్రశ్నించే ధైర్యం ఉందా? అని అన్నారు. మురుగన్‌ భక్తులు ఒక్కచూపు చూస్తే చాలు.. తమ దేవుడిని దూషించే కూటమి కంటికి కనిపించకుండా పోతుందన్నారు. సహజంగా నాస్తికులు భగవంతుడిని నమ్మరని గుర్తుచేశారు. కానీ, కొందరు మాత్రం హిందూ దేవుళ్లనే నమ్మమంటున్నారని వ్యాఖ్యానించారు. హిందూధర్మాన్ని తప్పితే ఇతర వాటిని నిలదీసే ధైర్యం వారికి లేదని పవన్ కళ్యాణ్​ అన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...