Homeక్రీడలుT20 World Cup | టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ విడుదల.. భారత్​ మ్యాచ్​లు ఎప్పుడంటే?

T20 World Cup | టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ విడుదల.. భారత్​ మ్యాచ్​లు ఎప్పుడంటే?

మెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయింది. ​2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ సాగనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : T20 World Cup | మెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయింది. వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీ వివరాలను ఐసీసీ (ICC) తాజాగా వెల్లడించింది. భారత్​, శ్రీలంక దేశాల్లో టోర్నీని నిర్వహించనున్నారు.

టీ 20 వరల్డ్​ కప్​ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. అహ్మదాబాద్​ (Ahmedabad)లో ఫైనల్​ మ్యాచ్​ నిర్వహించనున్నారు. మొత్తం 20 టీమ్​లు తలపడనున్నాయి. ఐదు జట్లకు ఒక గ్రూప్​ చొప్పున నాలుగు గ్రూప్​లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు టీమ్‌లు సూపర్ – 8కి అర్హత సాధిస్తాయి.

చివరి టీ20 ప్రపంచ కప్‌ను అమెరికా(USA), వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టోర్నీలో రోహిత్​ నాయకత్వంలో భారత్​ కప్​ కొట్టింది. డిఫెండింగ్​ ఛాంపియన్​ భారత్​కు తన సొంతగడ్డపై మెజారిటీ మ్యాచ్​లు ఆడనుంది. ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది.

T20 World Cup | భారత్​ మ్యాచుల వివరాలు..

ఫిబ్రవరి 7న భారతత్​ యూఎస్​ఏతో ముంబై వేదికగా తల పడుతుంది. 12న ఢిల్లీలో నమీబియాతో ఆడుతుంది. చిరకాల ప్రత్యర్థి పాక్​తో 15న కొలొంబోలో మ్యాచ్​ ఉండనుంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్​లో ఇండియా vs నెదర్లాండ్స్ మ్యాచ్​ ఉంటుంది. భారత్​ నాలుగు మ్యాచుల్లో పాకిస్థాన్​ మాత్రమే బలమైన జట్టు కావడం గమనార్హం. కాగా పాకిస్థాన్​ తన అన్ని మ్యాచ్​లను శ్రీలంకలోనే ఆడనుంది. భారత్, శ్రీలంక, పాకిస్థాన్​, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఓమన్, యూఏఈ జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి.