Homeతాజావార్తలుACB Trap | రూ.లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

ACB Trap | రూ.లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్​ కార్యాలయంలో సర్వేయర్​గా పని చేస్తున్న కిరణ్​ ఏసీబీకి చిక్కాడు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. రూ.లక్ష లంచం తీసుకుంటుంగా.. సర్వేయర్​ను ఏసీబీ అధికారులు (ACB officials) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్​ కార్యాలయంలో (Secunderabad Tahsildar office) సర్వేయర్​గా పని చేస్తున్న కిరణ్​ తాజాగా ఏసీబీకి చిక్కాడు. కాలువ కిరణ్​కుమార్​ సర్వేయర్​గా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి ఆస్తిపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆయన రూ.3 లక్షల లంచం (bribe) డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా సర్వేయర్​ తన సహాయకుడు, కార్యాలయంలో పని చేసే చైన్​మన్​ ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని ఇద్దరిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ACB Trap | నిజామాబాద్​లో సోదాలు

సర్వేయర్​ కిరణ్ గతంలో నిజామాబాద్​ జిల్లాలో (Nizamabad district) సుదీర్ఘ కాలం పని చేశారు. తహశీల్దార్​ కార్యాలయంలో మండల సర్వేయర్​గా, ఏడీ కార్యాలయంలో ఏళ్లుగా కొనసాగారు. ఆ సమయంలోనూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాగా ఒకసారి ఏసీబీ ట్రాప్​ నుంచి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం సికింద్రాబాద్​కు బదిలీపై వెళ్లారు. తాజాగా ఏసీబీకి చిక్కడంతో నిజామాబాద్​లో ఆయన ఇంట్లో, ఏడీ కార్యాలయంలో సైతం తనిఖీలు చేపట్టారు.