Supreme Court | నల్లమల సాగర్​పై సుప్రీం కీలక తీర్పు.. పిటిషన్​ వెనక్కి తీసుకున్న తెలంగాణ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | పోలవరం – నల్లమల సాగర్​పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వేసిన పిటిషన్​కు విచారణ అర్హత లేదని కోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Government) నిర్మిస్తున్న పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసింది. దీనిపై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్​ సింఘ్వీ మను వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | పోలవరం – నల్లమల సాగర్​పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వేసిన పిటిషన్​కు విచారణ అర్హత లేదని కోర్టు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Government) నిర్మిస్తున్న పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసింది. దీనిపై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్​ సింఘ్వీ మను వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్​కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) కేసును ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని కోర్టుకు తెలిపింది. రిట్ పిటిషన్​తో ఎలాంటి ఉపయోగం లేదని, ఇతర మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు తెలిపింది.

Supreme Court | ఆ రాష్ట్రాల వాదనలు వినాలి

ఏపీ సర్కార్​ పొలవరం నుంచి బనకచర్లకు నీటిని తరలించేందుకు నల్లమల సాగర్​ ప్రాజెక్ట్​ చేపట్టింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ వాదించింది. ఆ ప్రాజెక్ట్​తో రాష్ట్ర జల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. గోదావరి జలాల పంపిణీలో కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా సంబంధం ఉందన్నారు. దీంతో ఆ రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Supreme Court | పోరాటం కొనసాగిస్తాం

సుప్రీంకోర్టు విచారణ అనంతరం మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి (Minister Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కోర్టుకు అభ్యంతరం చెప్పామన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుపై రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఒకటి.. చేస్తుంది మరొకటని ఆయన పేర్కొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.