Chief Justice BR Gavai | కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

అక్షరటుడే, న్యూఢిల్లీ: Chief Justice BR Gavai కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ మండిపడ్డారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను పార్లమెంటు కూడా పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ఫిల్మ్ సర్టిఫికేషన్ ట్రిబ్యునల్‌తో పాటు పలు ట్రైబ్యునల్లు రద్దు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మద్రాస్ […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Chief Justice BR Gavai కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ మండిపడ్డారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను పార్లమెంటు కూడా పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు.

2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ఫిల్మ్ సర్టిఫికేషన్ ట్రిబ్యునల్‌తో పాటు పలు ట్రైబ్యునల్లు రద్దు అయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మద్రాస్ బార్ అసోసియేషన్, మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు.

Chief Justice BR Gavai : కీలక నిబంధనల కొట్టివేత..

ఈ పిటిషన్​పై విచారణ జరుపుతున్న చీఫ్​ జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్రంగా స్పందించారు. గతంలో న్యాయస్థానం కొట్టివేసిన పలు నిబంధనలకు స్వల్ప మార్పులు చేసి, కొత్త చట్టాలు తీసుకురావడం రాజ్యంగా విరుద్ధమని స్పష్టం చేశారు.

ఈ కేసు వాయిదా వేయాలని, ఇతర బెంచ్‌కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా.. నా నుంచి తప్పించుకుందామని, నేను పదవీ విరమణ పొందే వరకు తీర్పు రావొద్దని అనుకుంటున్నారా..? అంటూ ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు.

కోర్టు తీర్పులను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడం సరికాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ట్రైబ్యునళ్ల సంస్కరణ 2021 చట్టంలోని కీలక నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు నిచ్చారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.