Pothangal | పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన

అక్షరటుడే, కోటగిరి: Kotagiri | పోతంగల్ మండలం పీఎస్​ఆర్​నగర్​ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల(Integrated school) నిర్మాణ స్థలాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Mla Pocharam Srinivas Reddy), ఆగ్రోస్ ఇండస్ట్రీస్(Agros Industries) ఛైర్మన్ కాసుల బాలరాజ్ ఆదివారం స్థల పరిశీలన చేశారు. పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరవగా చెక్​పోస్ట్​ నుంచి హున్నా వరకు 11కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచేందుకు మరో రూ.30 కోట్లు మంజూరయ్యాయి. Pothangal | రేపు శంకుస్థాపనలు.. ఆయా […]

అక్షరటుడే, కోటగిరి: Kotagiri | పోతంగల్ మండలం పీఎస్​ఆర్​నగర్​ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల(Integrated school) నిర్మాణ స్థలాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Mla Pocharam Srinivas Reddy), ఆగ్రోస్ ఇండస్ట్రీస్(Agros Industries) ఛైర్మన్ కాసుల బాలరాజ్ ఆదివారం స్థల పరిశీలన చేశారు. పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరవగా చెక్​పోస్ట్​ నుంచి హున్నా వరకు 11కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచేందుకు మరో రూ.30 కోట్లు మంజూరయ్యాయి.

Pothangal | రేపు శంకుస్థాపనలు..

ఆయా అభివృద్ధి పనులకు సోమవారం వీరు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమయ్యే అన్ని వసతులతో కూడిన పాఠశాల భవన నిర్మాణం చేపడుతుండడంపై ఆనందం వ్యక్తం చేశారు.

సింగిల్ రోడ్డు ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు రూ.30 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్​ హన్మంత్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, కాంగ్రెస్ నాయకులు, కొట్టం మనోహర్, ఎజాజ్ ఖాన్, కేశ వీరేశం, పత్తి లక్ష్మణ్, గంట్ల విఠల్, షాహిద్, హంగర్గా గంగాధర్, మానిక్ అప్ప, బర్ల మధు, షాజీ, జుబేర్, పోచీరాం, మాధవరావు పటేల్, రాంబాబు, జగన్, ధన్​రాజ్, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.