అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rural Mla Bhupathi Reddy | నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రేకులపల్లి లక్ష్మీనర్సమ్మ (93) సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది.
నగర శివారులోని బైపాస్ అశోకా టౌన్షిప్లో (Ashoka Township) నివాసముంటున్న ఆమె కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మరణించారు. ఆమె అంత్యక్రియలను గూపన్పల్లిలోని (Gupanpally) శ్మశానవాటికలో మంగళవారం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డికి పలువురు నేతలు, ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.