Homeజిల్లాలుఆదిలాబాద్Adilabad Police | పోలీసుల వాహనంతో రీల్స్.. కేసు నమోదు

Adilabad Police | పోలీసుల వాహనంతో రీల్స్.. కేసు నమోదు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇద్దరు యువకులు పోలీస్​ వాహనంలో రీల్స్​ చేశారు. దీనిపై వన్​ టౌన్​ ఠాణాలో కేసు నమోదైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Adilabad Police | సోషల్​ మీడియాలో ఫేమస్​ కావడానికి కొందరు నానా తంటాలు పడుతున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రీల్స్​ చేస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్​ వాహనంలో రీల్స్​ చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్​ (Adilabad)లో చోటు చేసుకుంది.

సోషల్​ మీడియా (Social Media) పిచ్చితో యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రీల్స్​ కోసం ప్రమాకర స్టంట్లు చేయడంతో పాటు చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల వాహనంతో ఇద్దరు యువకులు రీల్స్​ చేశారు. అది కాస్త వైరల్​ అయింది. దీంతో ఆదిలాబాద్​ వన్​ టౌన్ పోలీసులు (Adilabad One Town Police) కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల కోసం‌ గాలింపు చర్యలు చేపట్టారు.

Adilabad Police | వాహనం ఎక్కడిది..

పోలీస్​ పెట్రోలింగ్​ వాహనం (Police Patrol Vehicle)లో రీల్స్​ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారిక వాహనంలో రీల్స్​ చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ యువకులకు పోలీస్​ వాహనం ఎక్కడిది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులకు తెలియకుండా వాహనం ఎత్తుకెళ్లి రీల్స్​ చేశారా.. లేదంటే శాఖలోని ఎవరైనా వాహనం ఇచ్చారా అనేది తెలియరాలేదు. ఒకవేళ పోలీస్​ పెట్రోలింగ్ వాహనాన్ని తెలియకుండా తీసుకు వెళ్లి రీల్స్​ చేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.