Kadapa | ప్రాణం తీసిన రీల్స్​ పిచ్చి.. నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు యువకుల మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kadapa | సోషల్​ మీడియాలో ఫేమస్​ కావడానికి కొంత మంది యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. రీల్స్​ (Reels) మోజులో పడి కన్న వారికి కడుపు కోత మిగులుస్తున్నారు. సోషల్​ మీడియా (Social Media) యుగంలో చాలా మంది రీల్స్​ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. గంటల కొద్ది స్మార్ట్​ఫోన్​ చూస్తున్నారు. పలువురు రీల్స్​ చేస్తూ ఫేమస్​ అవుతున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే తాము కూడా ఫేమస్​ కావాలని కొందరు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kadapa | సోషల్​ మీడియాలో ఫేమస్​ కావడానికి కొంత మంది యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. రీల్స్​ (Reels) మోజులో పడి కన్న వారికి కడుపు కోత మిగులుస్తున్నారు.

సోషల్​ మీడియా (Social Media) యుగంలో చాలా మంది రీల్స్​ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. గంటల కొద్ది స్మార్ట్​ఫోన్​ చూస్తున్నారు. పలువురు రీల్స్​ చేస్తూ ఫేమస్​ అవుతున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే తాము కూడా ఫేమస్​ కావాలని కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. బైక్​లపై విన్యాసాలు చేయడంతో పాటు రైల్వే ట్రాక్​లపై రీల్స్​ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గాయపడుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇద్దరు యువకులు రీల్స్​ కోసం వెళ్లి చనిపోయారు.

Kadapa | ప్రవాహం పెరగడంతో..

కడప (Kadapa) నగరానికి చెందిన ఐదుగురు యువకులు ఆదివారం రీల్స్​ చేయడానికి నగర శివారులోని వాటర్ గండి ప్రాంతానికి వెళ్లారు. నీటిలో దిగి రీల్స్​ చేయడం ప్రారంభించారు. అయితే ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారిలో ఒకరిని కాపాడారు. మిగతా ఇద్దరు గల్లంతయ్యారు. వెంటనే మిగతా వారు పోలీసు (Kadapa Police)లకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి వరకు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మళ్లీ గాలించగా.. ఇద్దరు యువకుల మృతదేహాలు లభించాయి. మృతులను అశోక్‌ నగర్‌ (Ashok Nagar)కు చెందిన గెంటెన్ రోహిత్, కామినేని నరేష్​గా గుర్తించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.