Homeజిల్లాలునిజామాబాద్​Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై పోలీసుల అవగాహన సదస్సు

Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై పోలీసుల అవగాహన సదస్సు

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ పేర్కొన్నారు. రెంజల్​ మండలంలోని నీలా, కందకుర్తి గ్రామాల్లో ఎన్నికలపై అవగాహన కల్పించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Local Body Elections | శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని బోధన్​ ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas)​ పేర్కొన్నారు. రెంజల్​ మండలంలోని నీలా, కందకుర్తి గ్రామాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Local Body Elections | ప్రత్యేక నిఘా..

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎలాంటి భయభ్రాంతులకు లోనకాకుండా స్వేచ్ఛగా ప్రతిఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ఎలాంటి అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ విజయ్​కుమార్​, రెంజల్​ ఎస్సై చంద్రమోహన్​, విలేజ్​ పోలీస్​ ఆఫీసర్​ తదితరులు పాల్గొన్నారు.