Homeజిల్లాలునిజామాబాద్​PDS Rice | పీడీఎస్​ బియ్యం పట్టివేత.. వాహనం సీజ్​

PDS Rice | పీడీఎస్​ బియ్యం పట్టివేత.. వాహనం సీజ్​

నిజామాబాద్​ నగర శివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రూరల్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PDS Rice | నగర శివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రూరల్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ (SHO Srinivas) వివరాలు వెల్లడించారు.

సాధారణ తనిఖీల్లో భాగంగా నగర శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఓ లారీలో తరలిస్తున్న 28 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్​ షేక్​ హుస్సేన్​ను విచారించారు. కాగా.. తాను ఇమ్రాన్​(బాల్కొండ), ఖలీల్(నిర్మల్), యూనిస్(నిర్మల్), తహర్(నిర్మల్) రెహ్మాన్(నిజామాబాద్) నుంచి సేకరించిన బియ్యాన్ని రైస్​మిల్ వ్యాపారి హరికృష్ణ సూచన మేరకు మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా తెలిపాడు. దీంతో వాహనాన్ని సీజ్​ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.