Homeతాజావార్తలుLocal Body Elections | పంచాయతీ ఎన్నికలు.. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు

Local Body Elections | పంచాయతీ ఎన్నికలు.. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు

పంచాయతీ ఎన్నిల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. రిజర్వేషన్లను ఖరారు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Local Body Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నిల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధం అవుతోంది. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషనర్​ రాణి కుముదిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బీసీ డెడికేషన్​ కమిషన్​ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

బీఆర్​ఎస్​ హయాంలో పంచాయతీ రాజ్​ చట్టం –2018 అమలులోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం పంచాయతీలకు పదేళ్ల పాటు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఈ చట్టానికి సవరణ చేసింది. దీంతో రిజర్వేషన్లు మారనున్నాయి. గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు ఉండే అవకాశం లేదు. మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 27 శాతం సర్పంచ్​ స్థానాలను బీసీలకు రిజర్వ్​ చేయనున్నారు. ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల జాబితాను ఎంపిక చేయనున్నారు.

Local Body Elections | 12,760 గ్రామాల్లో..

రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరగున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజ్​గిరి జిల్లాల పరిధిలో గ్రామాలు లేవు. దీంతో అక్కడ ఎన్నికలు ఉండవు. మిగతా 31 జిల్లాల్లోని 12,760 గ్రామాలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 50 శాతం సీట్లను రిజర్వ్​ చేస్తారు. మిగిలిన వాటిని జనరల్​కు కేటాయిస్తారు. 2024 బీసీ కుల గణన ప్రకారం.. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఖరారు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం.. సీట్లను రిజర్వ్​ చేయనున్నారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తారు.

కాగా సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేయనున్నారు. జనాభా ప్రతిపాదికన రోస్టర్​ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ నెల 24 హైకోర్టులో స్థానిక ఎన్నికల (Local Body Elections)పై విచారణ ఉంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేసే అవకాశం ఉంది. డిసెంబర్​లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్​ రోజే ఫలితాలు ప్రకటిస్తారు.