అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఒకరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పినిచ్చింది. ఐదో టౌన్ ఎస్హెచ్వో గంగాధర్ (SHO Gangadhar) వెల్లడించిన వివరాల మేరకు.. నగరంలోని ఐదో టౌన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా సోమవారం రాత్రి వర్ని చౌరస్తా వద్ద దారుగల్లీకి చెందిన షేక్ సుల్తాన్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా గుర్తించారు.
అనంతరం అతడికి కౌన్సెలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి ఏడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్హెచ్వో తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Drunk drive | ఆర్మూర్లో ముగ్గురికి రూ.30వేల జరిమానా
అక్షరటుడే, ఆర్మూర్: Drunk drive | పట్టణంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ముగ్గురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించి వారిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. విచారించిన కోర్టు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందని ఆయన వివరించారు.
