CM Revanth Reddy | సోనియా, రాహుల్​పై కేసులు పెడితే భయపడం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్​ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ (Rahul Gandhi)పై కేసులు పెడితే భయపడమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఇటీవల ఢిల్లీ పోలీసులు వారిపై మరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం స్పందించారు. హైదరాబాద్​లోని గాంధీ భవన్​ (Gandhi Bhavan)లో మంగళవారం కాంగ్రెస్​ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్​ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ (Rahul Gandhi)పై కేసులు పెడితే భయపడమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఇటీవల ఢిల్లీ పోలీసులు వారిపై మరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం స్పందించారు.

హైదరాబాద్​లోని గాంధీ భవన్​ (Gandhi Bhavan)లో మంగళవారం కాంగ్రెస్​ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిందన్నారు. నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబం అని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, ఆస్తులు ధారపోశారని చెప్పారు. స్వతంత్రం రావడంలో నేషనల్ హెరాల్డ్ (National Herald Case) పత్రికది ప్రముఖపాత్ర అని చెప్పారు.

CM Revanth Reddy | 7న ఓయూకు వెళ్తా

డిసెంబర్‌ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నట్లు సీఎం తెలిపారు. ఉద్దండులను అందించిన ఓయూను కేసీఆర్‌ కాలగర్భంలో కలిపారని విమర్శించారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని, ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పారు. సంక్షోభం, అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ తమకు అప్పగించారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఓఆర్​ఆర్​ లోపల ఉన్న కాలుష్య పరిశ్రమలను తరలిస్తామని సీఎం తెలిపారు.

CM Revanth Reddy | డీసీసీలది కీలక పాత్ర

స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) డీసీసీలదే కీలక పాత్ర అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు. సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీలందరూ అలెర్ట్​గా ఉండాలని సూచించారు. ఏఐసీసీ పరిశీలికుల చేత డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగిందన్నారు. రెండేళ్ల కాలంలో ఆరు గ్యారెంటీల్లో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయని వెల్లడించారు. తప్పకుండా నాయకుల పనికి తగ్గ గుర్తింపు దక్కుతుందని హామీ ఇచ్చారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...