Nizamabad District Education Officer | విచారణకు డీఈవో హాజరుకావాల్సిందే.. ఎమ్మెల్యే పీఏగా టీచర్ పని చేయడంపై కోర్టు ఆగ్రహం

అక్షరటుడే, ఇందూరు: Nizamabad District Education Officer | నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారికి నోటీసులు జారీ చేసినా కూడా విచారణకు హాజరుకాకపోవడంపై జిల్లా హ్యూమన్ రైట్స్ కోర్టు ( ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్) జడ్జి హరీషా ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవోకు బదులుగా విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ హాజరుకావడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ధర్పల్లి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే పీఏగా పని చేస్తుండటంపై […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad District Education Officer | నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారికి నోటీసులు జారీ చేసినా కూడా విచారణకు హాజరుకాకపోవడంపై జిల్లా హ్యూమన్ రైట్స్ కోర్టు ( ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్) జడ్జి హరీషా ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఈవోకు బదులుగా విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ హాజరుకావడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ధర్పల్లి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే పీఏగా పని చేస్తుండటంపై సామాజిక కార్యకర్త బొడ్డు గోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి విద్యాశాఖాధికారులు శ్రీనివాస్ రెడ్డి పీఏగా పని చేయడానికి సెలవులు మంజూరు చేయడంపై సహ చట్టం ద్వారా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో సామాజిక కార్యకర్త కోర్టును ఆశ్రయించారు.

Nizamabad District Education Officer | నోటీసులు జారీ..

ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఈ నెల మొదటి వారంలో డీఈవో అశోక్​తోపాటు ధర్పల్లి ఎంఈవోకు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం సంబంధిత కేసు విచారణకు వచ్చింది.

జిల్లా హ్యూమన్ రైట్స్ కోర్టు న్యాయమూర్తి హరీషా ఎదుట పిటిషన్ తరఫున న్యాయవాది బాల్​రాజ్ వాదనలు వినిపించారు. విద్యాశాఖాధికారులు ఏ విధంగా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసేందుకు సహాయ సహకారాలు అందించారో వివరించారు.

సంబంధిత కేసులో సహ చట్టం ద్వారా దరఖాస్తులు చేసినా విద్యాశాఖాధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై న్యాయమూర్తి మండిపడ్డారు.

సంబంధిత ఆర్టీఐ సమాచారాన్ని తామే తెప్పిస్తామని చెప్పారు. సంబంధిత కేసులో డీఈవో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేశారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.