Nashik Bus Accident | ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nashik Bus Accident | మహారాష్ట్రలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ Nashik జిల్లా సిన్నార్ బస్టాండులో ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో తొమ్మిదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని విచారణ జరిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Nashik […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nashik Bus Accident | మహారాష్ట్రలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ Nashik జిల్లా సిన్నార్ బస్టాండులో ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది.

ఈ దారుణ ఘటనలో తొమ్మిదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

డ్రైవరు బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని విచారణ జరిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Nashik Bus Accident | నియంత్రణ కోల్పోయి..

బస్టాండులో ఉదయం 10:45 గంటల సమయంలో బస్సు సిన్నార్ నుంచి దేవ్‌పూర్ బయలుదేరేందుకు ప్లాట్‌ఫామ్‌పై వద్దకు తీసుకొస్తుండగా.. నియంత్రణ కోల్పోయి, ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్న ప్రయాణికులపైకి దూసుకుపోయింది.

మృతి చెందిన బాలుడు దాపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ్ బోరధే గా గుర్తించారు. సదరు బాలుడు తన తల్లి గౌరీతో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గౌరీతోపాటు భలేరావ్, జ్ఞానేశ్వర్, మరో ప్రయాణికుడు గాయపడ్డారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.