48
అక్షరటుడే, వెబ్డెస్క్: Nashik Bus Accident | మహారాష్ట్రలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ Nashik జిల్లా సిన్నార్ బస్టాండులో ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది.
ఈ దారుణ ఘటనలో తొమ్మిదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
డ్రైవరు బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని విచారణ జరిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nashik Bus Accident | నియంత్రణ కోల్పోయి..
బస్టాండులో ఉదయం 10:45 గంటల సమయంలో బస్సు సిన్నార్ నుంచి దేవ్పూర్ బయలుదేరేందుకు ప్లాట్ఫామ్పై వద్దకు తీసుకొస్తుండగా.. నియంత్రణ కోల్పోయి, ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులపైకి దూసుకుపోయింది.
మృతి చెందిన బాలుడు దాపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ్ బోరధే గా గుర్తించారు. సదరు బాలుడు తన తల్లి గౌరీతో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గౌరీతోపాటు భలేరావ్, జ్ఞానేశ్వర్, మరో ప్రయాణికుడు గాయపడ్డారు.