Nizamabad DCC president | నిజామాబాద్​ డీసీసీ అధ్యక్షుడిగా నగేశ్​ రెడ్డి.. నగరాధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ

అక్షరటుడే, ఇందూరు: Nizamabad DCC president | కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఇందులో భాగంగా నిజామాబాద్​ డీసీసీ అధ్యక్షుడిగా నగేశ్​ రెడ్డి (Nagesh Reddy) నియమితులయ్యారు. అలాగే నిజామాబాద్​ నగరాధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. డీసీసీ, నగరాధ్యక్షుడి నియామకం కోసం అక్టోబర్​లో​ దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. పదవులకు చాలా మంది దరఖాస్తు చేసుకోగా.. పార్టీ వీరిద్దరి వైపు మొగ్గు చూపింది. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నగేశ్​ […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad DCC president | కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఇందులో భాగంగా నిజామాబాద్​ డీసీసీ అధ్యక్షుడిగా నగేశ్​ రెడ్డి (Nagesh Reddy) నియమితులయ్యారు. అలాగే నిజామాబాద్​ నగరాధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

డీసీసీ, నగరాధ్యక్షుడి నియామకం కోసం అక్టోబర్​లో​ దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. పదవులకు చాలా మంది దరఖాస్తు చేసుకోగా.. పార్టీ వీరిద్దరి వైపు మొగ్గు చూపింది. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నగేశ్​ రెడ్డి పార్టీలో సీనియర్​ నేతగా ఉన్నారు. పీసీసీ కార్యదర్శి, ప్రధానకార్యదర్శి కొనసాగారు. ఆయన గతంలో నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ (Nizamabad Market Committee) ఛైర్మన్​గా కూడా పనిచేశారు.

Nizamabad DCC president | డీసీసీ పదవికి దరఖాస్తు చేసుకుంది వీరే..

జిల్లా అధ్యక్ష పదవికి పలువురు సీనియర్​ నాయకులు దరఖాస్తులు అందజేశారు. ఇందులో నిజామాబాద్​కు చెందిన నరాల రత్నాకర్​, చంద్ర శేఖర్​ గౌడ్, సాయికుమార్​, ఎం.సాయిరెడ్డి, ముజ్జు పటేల్​, ఇమ్మడి గోపి, జగడం సుమన్​, మహమ్మద్​ జనీద్​ అక్రమ్​, ఎంఏ.హలీం ఉన్నారు. అలాగే ఆర్మూర్​కు చెందిన నేత అయ్యప్ప శ్రీనివాస్​, బాల్కొండ నుంచి వేణుగోపాల్​ యాదవ్​ సైతం దరఖాస్తు ఇచ్చారు.

Nizamabad DCC president | నగర అధ్యక్ష పదవికి..

ఇక నగర అధ్యక్ష పదవికి సైతం పలువురు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో నరాల రత్నాకర్​, గతంలో ఎన్ఎస్​యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన గన్​రాజ్​, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామర్తి గోపి, అంతిరెడ్డి విజయ్​ పాల్​ రెడ్డి, పంచరెడ్డి చరణ్​, అలాగే బొబ్బిలి రామకృష్ణ, కౌడిపు శరత్, మహమ్మద్ కైసర్, మహమ్మద్​ జనీద్​ అక్రమ్​ తమ దరఖాస్తులను అందజేశారు. అయితే అధిష్టానం బొబ్బిలి రామకృష్ణకు పదవిని ఇచ్చింది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.