Mulugu | పోలింగ్​ రోజు కుప్పకూలిన ఎంపీడీవో.. చికిత్స పొందుతూ మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mulugu | రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ముగిశాయి. బుధవారం మూడో విడత పోలింగ్​, కౌంటింగ్​ ప్రక్రియ నిర్వహించారు. అయితే పోలింగ్​ రోజు పని ఒత్తిడితో ఓ ఎంపీడీవో గుండెపోటుతో కుప్పకూలాడు. ఎన్నికల విధుల్లో ఒత్తిడికి గురైన ఎంపీడీవో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండుకు చెందిన జి రాజేంద్రప్రసాద్‌ (60) ములుగు జిల్లా వెంకటాపురం ఎంపీడీవో (Venkatapuram MPDO)గా పని చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mulugu | రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ముగిశాయి. బుధవారం మూడో విడత పోలింగ్​, కౌంటింగ్​ ప్రక్రియ నిర్వహించారు. అయితే పోలింగ్​ రోజు పని ఒత్తిడితో ఓ ఎంపీడీవో గుండెపోటుతో కుప్పకూలాడు.

ఎన్నికల విధుల్లో ఒత్తిడికి గురైన ఎంపీడీవో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండుకు చెందిన జి రాజేంద్రప్రసాద్‌ (60) ములుగు జిల్లా వెంకటాపురం ఎంపీడీవో (Venkatapuram MPDO)గా పని చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన కొంతకాలంగా సెలవులో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తిరిగి విధుల్లో చేరారు. బుధవారం వెంకటాపురం మండలంలో మూడో విడత ఎన్నికలు జరిగాయి. ఎంపీడీవో ఎన్నికలను పర్యవేక్షించారు.

Mulugu | టీస్టాల్​ దగ్గర..

కౌంటింగ్​ అనంతరం సిబ్బందికి పారితోషికం చెల్లించారు. ఈ క్రమంలో తమకు తక్కువ డబ్బులు చెల్లించారని పలువురు ఆయనతో వాగ్వాదం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆయన ఎంపీడీవో ఆఫీస్​ సమీపంలోని టీ స్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు, ఉద్యోగులు ఎంపీడీవోను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు (Heart attack) వచ్చినట్లు గుర్తించిన వైద్యులు ములుగు జిల్లా ఆసుపత్రికి రిఫర్​ చేశారు. అక్కడ వైద్యులు సీపీఆర్​, ఇతర పరీక్షలు చేశారు. అనంతరం వరంగల్​ (Warangal)కు తీసుకు వెళ్లాలని చెప్పారు. అక్కడకు తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.