అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఫోన్పేలో (PhonePe) ఒకరికి పంపాల్సిన డబ్బులు మరొకరిగా పంపగా..చివరకు కథ సుఖాంతమైంది.. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 5న హైదరాబాద్లోని (Hyderabad) అశోక్నగర్కు చెందిన గిరి విజయలక్ష్మి అనే మహిళ రూ.66వేలను ఫోన్పేలో తన స్నేహితులకు పంపాల్సి ఉండగా మరో నంబర్కు పొరపాటున పంపించారు.
చివరకు చెక్ చేసుకోగా వేరే నంబర్కు డబ్బులు వెళ్లినట్లు గుర్తించి ఆ నంబర్కు ఫోన్ చేయగా.. ఆర్మూర్కు చెందిన నూతల సత్తమ్మ ఫోన్పేకు వెళ్లినట్లుగా గుర్తించారు. అనంతరం బాధితులు హైదరాబాద్ నుంచి నేరుగా గురువారం ఆర్మూర్కు (Armoor) వచ్చి ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డిని సంప్రదించారు. దీంతో ఆయన వెంటనే నూతుల సత్మెమ్మను పిలిపించారు. విచారించగా తనకు రూ.66వేలు వచ్చిన మాట వాస్తమేనని ఆమె ఒప్పుకుని బాధితులకు తిరిగి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి నూతల సత్తెమ్మను సన్మానించారు.