Homeతాజావార్తలుPanchayat Elections | మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్​ విడుదల చేసిన ఈసీ

Panchayat Elections | మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్​ విడుదల చేసిన ఈసీ

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రం ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్​ విడుదల చేసింది. మూడు దశల్లో పోలింగ్​ నిర్వహించనున్నట్లు పేర్కొంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రం ఎన్నికల సంఘం (Election Commission) ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్​ విడుదల చేసింది. మూడు దశల్లో పోలింగ్​ నిర్వహించనున్నట్లు పేర్కొంది.

పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ రాణికుముదిని వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికల కోడ్​ అమలోకి వచ్చినట్లు తెలిపారు. తొలి విడత ఎన్నికల ప్రక్రియ నవంబర్​ 27న ప్రారంభం కానుంది. నవంబర్​ 27 నుంచి తొలిదశ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్​ 11న ఎన్నిక ఉంటుంది. రెండో దశలో నవంబర్​ 30 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 193 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్​ 14న పోలింగ్​ ఉంటుంది. మూడో దశ నామినేషన్లు డిసెంబర్​ 3 నుంచి ప్రారంభం అవుతాయి. 182 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.  డిసెంబర్​ 17న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్​ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతారు. అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.

Panchayat Elections | 12,760 గ్రామాల్లో..

రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజ్​గిరి జిల్లాల పరిధిలో గ్రామాలు లేవు. దీంతో అక్కడ ఎన్నికలు ఉండవు. మిగతా 31 జిల్లాల్లోని 12,760 గ్రామాలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లను బీసీ కుల గణన ప్రకారం ఖరారు చేశారు. సర్పంచ్​ స్థానాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను (BC Reservations) కుల గణన ఆధారంగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేశారు.