Red Cross Society | బ్లడ్​బ్యాంక్​లో కోల్డ్​ స్టోరేజ్​ను​ ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి

అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | జిల్లాలో రెడ్​క్రాస్​ సొసైటీ సేవలు అభినందనీయమని ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy) పేర్కొన్నారు. రెడ్​క్రాస్ బ్లడ్ బ్యాంక్​లో (Red Cross Blood Bank) కోల్డ్ స్టోరేజ్​ను ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాకేష్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోల్డ్​ స్టోరేజీ యూనిట్​ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. […]

అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | జిల్లాలో రెడ్​క్రాస్​ సొసైటీ సేవలు అభినందనీయమని ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy) పేర్కొన్నారు. రెడ్​క్రాస్ బ్లడ్ బ్యాంక్​లో (Red Cross Blood Bank) కోల్డ్ స్టోరేజ్​ను ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాకేష్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోల్డ్​ స్టోరేజీ యూనిట్​ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన రక్తసేవలు అందించేందుకు కోల్డ్​ స్టోరేజ్​ ఉపయోగపడుతుందన్నారు.

Red Cross Society | సేవలు అభింనందనీయం..

జిల్లాలో తలసేమియా రోగులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రెడ్​క్రాస్​ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యేలు ప్రశంసించారు. యువతను మరింతగా సేవల్లో భాగస్వామ్యం కల్పిస్తూ ముంందుకు వెళ్లాలని వారు సూచించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీకి సుమారు రూ.15లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డికి రెడ్​క్రాస్​ సొసైటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి, పేద రోగులకు అందించే సేవలు మరింత బలోపేతం అవుతాయని వారు పేర్కొన్నారు.

Red Cross Society | టీబీ వ్యాధిగ్రస్థులకు పోషకాహారం కిట్లు..

అనంతరం, క్షయ (TB) వ్యాధితో బాధపడుతున్న 20 మంది రోగులకు పోషకాహార ఆరోగ్య కిట్లను ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, పైడి రాకేష్​ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే రెడ్​క్రాస్ తలసేమియా వార్డులో చికిత్స పొందుతున్న తలసేమియా రోగులకు పండ్లను పంపిణీ చేసి వారికి మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్ బిన్ హందాన్​, డా.కవిత రెడ్డి, అరికెల నర్సారెడ్డి, రెడ్​క్రాస్ జిల్లా ఛైర్మన్​ బుస్సా ఆంజనేయులు, వైస్ ఛైర్మన్​ డొల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపె రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, నిజామాబాద్ డివిజనల్ ఛైర్మన్ డాక్టర్​ శ్రీశైలం మ్యానెగింగ్ కమిటీ సభ్యులు డా. నీలి రాంచందర్, సూర్య నారాయణ, డాక్టర్​ అబ్బాపూర్ రవీందర్​, జి. హనుమంతరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.