Mla Madan Mohan | అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్​మోహన్​ శంకుస్థాపనలు

అక్షరటుడే సదాశివనగర్/ గాంధారి: Mla Madan Mohan | పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్​మోహన్​ (Mla Madan Mohan) మంగళవారం శంకుస్థాపనలు చేశారు. సదాశివనగర్​, గాంధారి మండలాల్లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా భూమిపూజ, శంకుస్థాపనలు, చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో ఎస్సీకాలనీలో రూ.25 లక్షలలతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు (drainage works) శంకుస్థాపన చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం రూ.5లక్షల నిధులు మంజూరు చేశారు. హైమాస్ట్​ […]

అక్షరటుడే సదాశివనగర్/ గాంధారి: Mla Madan Mohan | పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్​మోహన్​ (Mla Madan Mohan) మంగళవారం శంకుస్థాపనలు చేశారు. సదాశివనగర్​, గాంధారి మండలాల్లో మంగళవారం పర్యటించారు.

ఈ సందర్భంగా భూమిపూజ, శంకుస్థాపనలు, చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో ఎస్సీకాలనీలో రూ.25 లక్షలలతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు (drainage works) శంకుస్థాపన చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం రూ.5లక్షల నిధులు మంజూరు చేశారు. హైమాస్ట్​ లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతరం అమర్లబండ గ్రామంలోని హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2.70 కోట్ల వ్యయంతో శంకుస్థాపన పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్​మోహన్​ మాట్లాడుతూ 30 ఏళ్ల గ్రామస్థుల కలను నెరవేర్చనున్నట్లు ఆయన తెలిపారు.

Mla Madan Mohan | గాంధారి మండల కేంద్రంలో..

గాంధారి మండలకేంద్రంలో రూ.4.9 కోట్ల వ్యయంతో పోచమ్మ రేవు వంతెన (Pochamma Revu Bridge) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో ఇందిరమ్మ చీరల (Indiramma sarees) పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.