Homeజిల్లాలునిజామాబాద్​Railway Police | రైలులో ల్యాప్​టాప్​ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్​

Railway Police | రైలులో ల్యాప్​టాప్​ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్​

రైలులో ల్యాప్​టాప్​ చోరీ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ఎస్​హెచ్​వో సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Railway Police | రైలులో ల్యాప్​టాప్​ చోరీ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ఎస్​హెచ్​వో సాయిరెడ్డి (Railway SHO Sai Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు.

దేవగిరి ఎక్స్​ప్రెస్​లో (Devagiri Express) సోమవారం నాందేడ్​ నుంచి సికింద్రాబాద్​కు మాహారాష్ట్రకు చెందిన వ్యక్తి ల్యాప్​టాప్​తో ప్రయాణిస్తున్నాడు. అయితే అతడు నిద్రపోతున్న సమయంలో ఔరంగాబాద్​కు చెందిన నదీం అనే వ్యక్తి ల్యాప్​టాప్​ చోరీ చేశాడు. అనంతరం బాసర రైల్వేస్టేషన్​లో దిగి వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు నిజామాబాద్​ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి నుంచి ల్యాప్​టాప్​ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్​కు తరలించారు.