Railway Police | రైలులో ల్యాప్​టాప్​ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్​

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Railway Police | రైలులో ల్యాప్​టాప్​ చోరీ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ఎస్​హెచ్​వో సాయిరెడ్డి (Railway SHO Sai Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. దేవగిరి ఎక్స్​ప్రెస్​లో (Devagiri Express) సోమవారం నాందేడ్​ నుంచి సికింద్రాబాద్​కు మాహారాష్ట్రకు చెందిన వ్యక్తి ల్యాప్​టాప్​తో ప్రయాణిస్తున్నాడు. అయితే అతడు నిద్రపోతున్న సమయంలో ఔరంగాబాద్​కు చెందిన నదీం అనే వ్యక్తి ల్యాప్​టాప్​ చోరీ చేశాడు. అనంతరం బాసర రైల్వేస్టేషన్​లో దిగి వెళ్లిపోయాడు. […]

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Railway Police | రైలులో ల్యాప్​టాప్​ చోరీ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ఎస్​హెచ్​వో సాయిరెడ్డి (Railway SHO Sai Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు.

దేవగిరి ఎక్స్​ప్రెస్​లో (Devagiri Express) సోమవారం నాందేడ్​ నుంచి సికింద్రాబాద్​కు మాహారాష్ట్రకు చెందిన వ్యక్తి ల్యాప్​టాప్​తో ప్రయాణిస్తున్నాడు. అయితే అతడు నిద్రపోతున్న సమయంలో ఔరంగాబాద్​కు చెందిన నదీం అనే వ్యక్తి ల్యాప్​టాప్​ చోరీ చేశాడు. అనంతరం బాసర రైల్వేస్టేషన్​లో దిగి వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు నిజామాబాద్​ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి నుంచి ల్యాప్​టాప్​ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.