Limbadri Gutta | లక్ష్మీనృసింహ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అక్షరటుడే, భీమ్‌ గల్: Limbadri Gutta | భీమ్‌గల్‌ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవ మూర్తులు గ్రామంలోని ఆలయం నుంచి కొండపైకి చేరుకోవడంతో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ముందు శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు (Brahmotsavams) నాంది పలికే కార్యక్రమం మంగళవారం ఆలయ పురోహితులు నిర్వహించారు. ఈ నాంది కార్యక్రమాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాల్లో భాగంగా మత్స్య గ్రహణం, దీపారాధన, రక్షాబంధనం, గరుడ […]

అక్షరటుడే, భీమ్‌ గల్: Limbadri Gutta | భీమ్‌గల్‌ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవ మూర్తులు గ్రామంలోని ఆలయం నుంచి కొండపైకి చేరుకోవడంతో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ముందు శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు (Brahmotsavams) నాంది పలికే కార్యక్రమం మంగళవారం ఆలయ పురోహితులు నిర్వహించారు. ఈ నాంది కార్యక్రమాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాల్లో భాగంగా మత్స్య గ్రహణం, దీపారాధన, రక్షాబంధనం, గరుడ పటాధివాసం, ధ్వజారోహణం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అంకురార్పణ కార్యక్రమాన్ని (Ankurarpana program) ఆగమ శాస్త్రం ప్రకారం పుట్ట మట్టిని సేకరించి పాత్రలో వేసి విత్తనాలు వేశారు. ఉత్సవాలు ఆరంభమైన నాటి నుంచి ముగింపు వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలన్న భావనతో అంకురార్పణ కార్యక్రమాన్ని వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Limbadri Gutta | అంకురార్పణ అంటే..

అంకురం అంటే మొలక అని అర్థం. ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించే ముందు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అదే విధంగా లింబాద్రి గుట్టపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించే ముందు ఈ అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

Limbadri Gutta | వైఖానస పద్ధతిలో అంకురార్పణ..

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్ట మన్ను సేకరించి నవధాన్యాలను నాటే కార్యక్రమం జరుగుతుంది. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

Limbadri Gutta | సకల దేవతలకు ఆహ్వానం..

అంకురార్పణకు ముందు, మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మ పీఠాన్ని (Brahma Peetham) ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత అగ్నిహోత్రం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. కార్యక్రమంలో వేద పండితులు పార్థ సారథి, మహేష్, శ్రీనివాస్, ప్రణీత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.