Homeఆంధప్రదేశ్KTR and YS Jagan | ఒకే వేదికపై కేటీఆర్​, వైఎస్​ జగన్​.. ఉభయ రాష్ట్రాల్లో...

KTR and YS Jagan | ఒకే వేదికపై కేటీఆర్​, వైఎస్​ జగన్​.. ఉభయ రాష్ట్రాల్లో చర్చకు దారితీసిన అధి–అగ్ర నేతల కలయిక!

KTR and YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు ఒకే వేదికపై కలుసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: KTR and YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు ఒకే వేదికపై తారసపడ్డారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్​ఆర్​ సీపీ అధినేత, బీఆర్ఎస్​ అగ్రనేత కలయిక.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ చర్చకు దారితీసింది.

బెంగళూరులో శనివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమానికి ఈ ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్​, కేటీఆర్​ పక్కపక్కనే కూర్చొన్నారు. సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా, వీరిద్దరూ పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

KTR and YS Jagan | కేసీఆర్​పై జగన్​ ప్రశంసల జల్లు..

తెలంగాణలో గత సీఎం కేసీఆర్ పాలనపై, హైదరాబాద్ అభివృద్ధిపై ఇటీవల వైఎస్​ జగన్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం  అని, రాజకీయాలకు సంబంధం లేదని ఇరు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.