KTR and YS Jagan | ఒకే వేదికపై కేటీఆర్​, వైఎస్​ జగన్​.. ఉభయ రాష్ట్రాల్లో చర్చకు దారితీసిన అధి–అగ్ర నేతల కలయిక!

అక్షరటుడే, హైదరాబాద్​: KTR and YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు ఒకే వేదికపై తారసపడ్డారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్​ఆర్​ సీపీ అధినేత, బీఆర్ఎస్​ అగ్రనేత కలయిక.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ చర్చకు దారితీసింది. బెంగళూరులో శనివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమానికి ఈ ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్​, కేటీఆర్​ పక్కపక్కనే కూర్చొన్నారు. సరదాగా […]

అక్షరటుడే, హైదరాబాద్​: KTR and YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు ఒకే వేదికపై తారసపడ్డారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్​ఆర్​ సీపీ అధినేత, బీఆర్ఎస్​ అగ్రనేత కలయిక.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ చర్చకు దారితీసింది.

బెంగళూరులో శనివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమానికి ఈ ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్​, కేటీఆర్​ పక్కపక్కనే కూర్చొన్నారు. సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా, వీరిద్దరూ పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

KTR and YS Jagan | కేసీఆర్​పై జగన్​ ప్రశంసల జల్లు..

తెలంగాణలో గత సీఎం కేసీఆర్ పాలనపై, హైదరాబాద్ అభివృద్ధిపై ఇటీవల వైఎస్​ జగన్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం  అని, రాజకీయాలకు సంబంధం లేదని ఇరు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.