Nandigama | మరో బస్సు ప్రమాదం.. న‌లుగురికి తీవ్ర గాయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Nandigama | తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల పరంపర ఆగడం లేదు. సాధారణ ప్రయాణం కూడా మృత్యుమార్గంగా మారిపోతుండటం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాదిలో ఏపీ–తెలంగాణ జాతీయ రహదారుల (National Highways)పై పదుల సంఖ్యలో బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రధాన కారణాలు అని నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా (NTR District)లోని నందిగామ బైపాస్‌ అనాసాగరం ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం ఉదయం భయానక రోడ్డు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Nandigama | తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల పరంపర ఆగడం లేదు. సాధారణ ప్రయాణం కూడా మృత్యుమార్గంగా మారిపోతుండటం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ ఏడాదిలో ఏపీ–తెలంగాణ జాతీయ రహదారుల (National Highways)పై పదుల సంఖ్యలో బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రధాన కారణాలు అని నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా (NTR District)లోని నందిగామ బైపాస్‌ అనాసాగరం ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావేరీ ట్రావెల్స్‌ (Kaveri Travels)కు చెందిన ప్రయివేట్‌ బస్సు లారీని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఎదురుగా వచ్చిన మరో లారీని ఢీకొట్టింది.

Nandigama | అతివేగమే కారణమా?

బస్సు హైదరాబాద్ (Hyderabad) నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన ప్రభావానికి బస్సు ఎడమ భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. అప్పుడు బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి (Nandigama Government Hospital)కి తరలించారు. అనేక మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు వేగంగా లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు ప్రయివేట్ బస్సుల డ్రైవింగ్ ప్రమాణాలపై, రోడ్డు భద్రత చర్యలపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు అత్యవసర చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.