Jagga Reddy | నెక్ట్స్​ సీఎం నేనే.. సీఎం కుర్చీపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

అక్షరటుడే, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC working president), కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ముందుగానే ప్రజలకు అప్పీలు పెట్టుకున్నారని అన్నారు. రేవంత్​ దిగిపోయాక తాను సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం(జూన్​ 26) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ సర్కారును అధికారంలోకి తీసుకొచ్చి, రేవంత్ సీఎం అయ్యేందుకు చూస్తున్నట్లు […]

అక్షరటుడే, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC working president), కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ముందుగానే ప్రజలకు అప్పీలు పెట్టుకున్నారని అన్నారు. రేవంత్​ దిగిపోయాక తాను సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.

గురువారం(జూన్​ 26) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ సర్కారును అధికారంలోకి తీసుకొచ్చి, రేవంత్ సీఎం అయ్యేందుకు చూస్తున్నట్లు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక (తొమ్మిదేళ్ల తర్వాత) సీఎం అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Jagga Reddy : రైతుభరోసా..

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన సూపర్​గా కొనసాగుతోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గతంలో రైతు బంధు డబ్బులు వేసేందుకు బీఆర్​ఎస్​ సర్కారు ఐదు నెలల సమయం తీసుకునేదని, కానీ కాంగ్రెస్ సర్కారు కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందని చెప్పుకొచ్చారు. బీఆర్​ఎస్​ హయాంలో నిధులు అందుబాటులో ఉన్నా.. వేయలేదని, కాంగ్రెస్ సర్కారు మాత్రం అప్పులు కడుతూ రైతు భరోసా డబ్బులు వేసిందన్నారు.

Jagga Reddy : ఫోన్‌ ట్యాపింగ్‌..

ఫోన్‌ ట్యాపింగ్‌ phone tapping వ్యవహారంపైనా జగ్గారెడ్డి మాట్లాడారు. బీఆర్​ఎస్​ సర్కారు అంతా ఫోన్ ట్యాపింగ్‌తోనే నడిచిందని దుయ్యబట్టారు. నాడు తన ఫోన్ సైతం ట్యాప్ అయినట్లు పోలీసులు చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ నేతల ఫోన్‌లు ట్యాప్‌ చేయడంపైనే దృష్టి పెట్టిన బీఆర్​ఎస్​.. గత పదేళ్ల పాలనను గాలికొదిలేసిందని ఎద్దేవా చేశారు.

Jagga Reddy : కవితపై ఘాటు విమర్శలు..

కేసీఆర్ KCR కుటుంబంపై సైతం జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. కేసీఆర్‌ గృహం డ్రామా కంపెనీగా మారిందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) వ్యాఖ్యలు వింటుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదన్నారు. రేవంత్, కేసీఆర్ ఒకేస్థాయి వారని, వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే ఒక అర్థం ఉంటుందని, వీరి మధ్యలో కవిత దూరడం సబబుగా లేదని అన్నారు. కేసీఆర్ కూతురుగా మినహా కవితకు అదనంగా అర్హతలు ఏమిటని జగ్గారెడ్డి నిలదీశారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.