YS Jagan | జీఎస్టీ కొత్త స్లాబులపై జగన్ ప్రశంసలు.. పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | నేటి (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ స్లాబులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) మోహన్ రెడ్డి దీనిపై స్పందించటం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. జీఎస్టీ పునర్నిర్మాణాన్ని అభినందించిన జగన్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జీఎస్టీపై స్పందించిన జగన్.. GST పునర్నిర్మాణం అనేది ఒక సరళమైన, నిష్పక్షికమైన పన్ను […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | నేటి (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ స్లాబులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) మోహన్ రెడ్డి దీనిపై స్పందించటం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.

జీఎస్టీ పునర్నిర్మాణాన్ని అభినందించిన జగన్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జీఎస్టీపై స్పందించిన జగన్.. GST పునర్నిర్మాణం అనేది ఒక సరళమైన, నిష్పక్షికమైన పన్ను వ్యవస్థ దిశగా విప్లవాత్మక అడుగు. ప్రతి పౌరుడికి వస్తువులు, సేవలు మరింత సరళంగా, అందుబాటులోకి వచ్చేలా చేయడమే లక్ష్యం,” అని అన్నారు.

YS Jagan | జ‌గ‌న్ ట్వీట్ హాట్ టాపిక్..

ఈ కొత్త విధానం ద్వారా చివరి వినియోగదారుడికి కూడా ప్రయోజనాలు చేరతాయని ఆశిస్తున్నాను. కొన్ని లోపాలు, ఫిర్యాదులు ఉండొచ్చుగానీ, ఇది ఆర్థిక వ్యవస్థకు అవసరమైన బూస్ట్‌ను ఇస్తుంది,” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా మోదీ(PM Modi) ప్రభుత్వాన్ని ప్రశంసించేలా ఉండటంతో, రాజకీయంగా ఇది తీవ్రంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ NDA కూటమి అధికారంలో ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ప్రతిపక్షంలో ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జగన్ ఇలాంటీ సానుకూల వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కసరత్తుకి దారి తీస్తోంది.

ఇప్పటికే ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతు ఇవ్వడం విశేషమే. ఇప్పుడు GSTపై సానుకూలమైన స్పందనను కూడా జగన్ చూపడం ఏపీ రాజకీయ వర్గాల్లో అనేక రకాల ఊహాగానాలకు కారణమవుతోంది. ఈ వ్యాఖ్యలపై ఎన్డీఏ ప్రభుత్వ ప్రతినిధులు ఎలా స్పందిస్తారు? జగన్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందా? కేంద్రంతో వైసీపీకి ఏమైనా పొత్తు రాజకీయాలు రాబోతున్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ఒకవైపు అధికార టీడీపీ నేతలు, మరోవైపు వైసీపీ శ్రేణులు ..ఇరువర్గాలు ఈ వ్యాఖ్యలను తమదైన కోణంలో విశ్లేషించడం ప్రారంభించాయి. మొత్తం మీద, జగన్ జీఎస్టీపై చేసిన‌ ప్రశంసల ఫోస్ట్‌ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర మలుపు తీసుకుంది. రానున్న రోజుల్లో ఇది మరింత చర్చనీయాంశమవనుంది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.