ePaper
More
    HomeతెలంగాణIT Raids | హైదరాబాద్​లో ఐటీ సోదాల కలకలం.. మాజీ ఎంపీ కంపెనీల్లో తనిఖీలు

    IT Raids | హైదరాబాద్​లో ఐటీ సోదాల కలకలం.. మాజీ ఎంపీ కంపెనీల్లో తనిఖీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IT Raids | హైదరాబాద్​ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్​రెడ్డి (Former Chevella MP Ranjith Reddy) నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న డీఎస్​ఆర్​ గ్రూప్​ కంపెనీలపై (DSR Group Company) ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం ఏకకాలంలో హైదరాబాద్​తో పాటు బెంగళూరులోని 27 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

    జగిత్యాల జిల్లాకు చెందిన గడ్డం రంజిత్​రెడ్డి (Gaddam Ranjith Reddy) రియల్​ ఎస్టేట్​ వ్యాపారిగా ఎదిగారు. ఆయన 2019లో బీఆర్​ఎస్​ నుంచి చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2024లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన తన అఫిడవిట్‌లో రూ.435 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించాడు. ఆయన అత్యంత ధనవంతులైన మాజీ ఎంపీలలో ఆయన ఒకరిగా నిలిచిచారు.

    IT Raids | పన్ను చెల్లింపుల్లో అవకతవకలు

    మాజీ ఎంపీ రంజిత్​రెడ్డి ఇంటితో పాటు, డీఎస్​ఆర్​ ఇన్​ఫ్రా స్ట్రక్చర్​ ప్రైవేట్​ లిమిటెడ్ (DSR Infrastructure Private Limited)​, ఇతర గ్రూప్​ సంస్థల ఆఫీసులు, కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్థిక రికార్డులు, సంబంధిత లావాదేవీలను పరిశీలించారు. మాజీ ఎంపీకి చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. DSR ప్రాజెక్టులలో లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను వెలికితీయడమే ఈ సోదాల లక్ష్యమని అధికారులు తెలిపారు. డీఎస్​ఆర్​ స్కైవన్ (DSR Sky One)​, డీఎస్​ఆర్​ వరల్డ్​ వెంచర్ల వంటి ప్రాజెక్టులలో ఫ్లాట్‌లు చదరపు అడుగుకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయించినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్​ సమయంలో మాత్రం రూ.7 వేలుగా చూపినట్లు అధికారులు గుర్తించారు.

    IT Raids | కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

    మాజీ ఎంపీతో ఐటీ శాఖ గ్రూప్ డైరెక్టర్లు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి ఇళ్లలోను అధికారులు సోదాలు జరిపారు. జూబ్లీ హిల్స్​లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్​(Hyderabad), బెంగళూరులోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా పలు అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం 400 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

    Latest articles

    Nizamsagar Project | నిజాంసాగర్​ను టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తున్నాం..

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్టును టూరిజం స్పాట్​గా (Tourism spot) అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్​...

    Dhurandhar Movie | స్టార్ హీరో మూవీ షూటింగ్‌లో ఫుడ్ పాయిజ‌న్.. 120 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhurandhar Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన...

    Indiramma Housing Scheme | ప్రారంభోత్సవాలకు ముస్తాబైన ఇందిరమ్మ ఇళ్లు.. పరిశీలించిన కలెక్టర్

    అక్షరటుడే, బోధన్: Indiramma Housing Scheme | జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లల్లో పురోగతి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల...

    Bodhan | బ్యాక్​వాటర్​ను పరిశీలించిన అదనపు కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు...

    More like this

    Nizamsagar Project | నిజాంసాగర్​ను టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తున్నాం..

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్టును టూరిజం స్పాట్​గా (Tourism spot) అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్​...

    Dhurandhar Movie | స్టార్ హీరో మూవీ షూటింగ్‌లో ఫుడ్ పాయిజ‌న్.. 120 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhurandhar Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన...

    Indiramma Housing Scheme | ప్రారంభోత్సవాలకు ముస్తాబైన ఇందిరమ్మ ఇళ్లు.. పరిశీలించిన కలెక్టర్

    అక్షరటుడే, బోధన్: Indiramma Housing Scheme | జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లల్లో పురోగతి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల...