IT Raids | హైదరాబాద్​లో ఐటీ సోదాల కలకలం.. మాజీ ఎంపీ కంపెనీల్లో తనిఖీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IT Raids | హైదరాబాద్​ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్​రెడ్డి (Former Chevella MP Ranjith Reddy) నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న డీఎస్​ఆర్​ గ్రూప్​ కంపెనీలపై (DSR Group Company) ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం ఏకకాలంలో హైదరాబాద్​తో పాటు బెంగళూరులోని 27 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. జగిత్యాల జిల్లాకు చెందిన గడ్డం రంజిత్​రెడ్డి (Gaddam Ranjith Reddy) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IT Raids | హైదరాబాద్​ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్​రెడ్డి (Former Chevella MP Ranjith Reddy) నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న డీఎస్​ఆర్​ గ్రూప్​ కంపెనీలపై (DSR Group Company) ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం ఏకకాలంలో హైదరాబాద్​తో పాటు బెంగళూరులోని 27 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

జగిత్యాల జిల్లాకు చెందిన గడ్డం రంజిత్​రెడ్డి (Gaddam Ranjith Reddy) రియల్​ ఎస్టేట్​ వ్యాపారిగా ఎదిగారు. ఆయన 2019లో బీఆర్​ఎస్​ నుంచి చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2024లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన తన అఫిడవిట్‌లో రూ.435 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించాడు. ఆయన అత్యంత ధనవంతులైన మాజీ ఎంపీలలో ఆయన ఒకరిగా నిలిచిచారు.

IT Raids | పన్ను చెల్లింపుల్లో అవకతవకలు

మాజీ ఎంపీ రంజిత్​రెడ్డి ఇంటితో పాటు, డీఎస్​ఆర్​ ఇన్​ఫ్రా స్ట్రక్చర్​ ప్రైవేట్​ లిమిటెడ్ (DSR Infrastructure Private Limited)​, ఇతర గ్రూప్​ సంస్థల ఆఫీసులు, కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్థిక రికార్డులు, సంబంధిత లావాదేవీలను పరిశీలించారు. మాజీ ఎంపీకి చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. DSR ప్రాజెక్టులలో లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను వెలికితీయడమే ఈ సోదాల లక్ష్యమని అధికారులు తెలిపారు. డీఎస్​ఆర్​ స్కైవన్ (DSR Sky One)​, డీఎస్​ఆర్​ వరల్డ్​ వెంచర్ల వంటి ప్రాజెక్టులలో ఫ్లాట్‌లు చదరపు అడుగుకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయించినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్​ సమయంలో మాత్రం రూ.7 వేలుగా చూపినట్లు అధికారులు గుర్తించారు.

IT Raids | కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

మాజీ ఎంపీతో ఐటీ శాఖ గ్రూప్ డైరెక్టర్లు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి ఇళ్లలోను అధికారులు సోదాలు జరిపారు. జూబ్లీ హిల్స్​లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్​(Hyderabad), బెంగళూరులోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా పలు అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం 400 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.