Nizamabad City | అడ్డగోలుగా అనుమతులు.. ఆ భవనాల పర్మిషన్లపై ఏసీబీ ఆరా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad City | నిజామాబాద్​ నగరంలోని పలు భవనాల నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సెట్​బ్యాక్​ నిబంధనలు పాటించకపోయినా, నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టకున్నా నగర పాలక సంస్థ అధికారులు ఎవరికి నచ్చినట్లు వారు పర్మిషన్లు ఇచ్చారు. కాగా తాజాగా కార్పొరేషన్​ కార్యాలయంలో (Municipal Corporation Office) ఏసీబీ సోదాలు నిర్వహించగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నగర పాలక సంస్థ టౌన్​ ప్లానింగ్​ విభాగంలో (town planning department) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad City | నిజామాబాద్​ నగరంలోని పలు భవనాల నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సెట్​బ్యాక్​ నిబంధనలు పాటించకపోయినా, నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టకున్నా నగర పాలక సంస్థ అధికారులు ఎవరికి నచ్చినట్లు వారు పర్మిషన్లు ఇచ్చారు. కాగా తాజాగా కార్పొరేషన్​ కార్యాలయంలో (Municipal Corporation Office) ఏసీబీ సోదాలు నిర్వహించగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

నగర పాలక సంస్థ టౌన్​ ప్లానింగ్​ విభాగంలో (town planning department) గతంలో పని చేసిన టీపీవోల హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సమాచారం. ప్రత్యేకించి సెట్​ బ్యాక్​ నిబంధనలు ఉల్లంఘించిన రెసిడెన్షియల్​, కమర్షియల్​ భవనాలకు (residential and commercial buildings) ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. నగరంలోని ప్రధాన రహదారులు వెంట ఉన్న కమర్షియల్ బిల్డింగ్​లు నిబంధనల ప్రకారం లేకపోయినా.. వాటికి రాత్రికి రాత్రే కార్పొరేషన్​ నుంచి అనుమతులు మంజూరు చేశారు. కొన్నింటికి ట్యాక్స్​​ అసెస్​మెంట్​ ఇవ్వడం గమనార్హం.

Nizamabad City | ఉల్లంఘనలు ఇలా..

వర్ని రోడ్డులో (Varni Road) ఓ కమర్షియల్ భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగింది. ఈ భవనం బీజేపీకి చెందిన మాజీ కార్పొరేటర్​ది కావడంతో ఎలాంటి నిబంధనలు పాటించకపోయినప్పటికీ జరిమానాలు ఏవీ విధించకుండా నేరుగా ట్యాక్స్​ అసెస్​మెంట్​ జారీ చేశారు. దీంతో నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడింది.

పులాంగ్​ చౌరస్తా సమీపంలో కొనసాగుతున్న ప్రముఖ ఐ హాస్పిటల్​ భవనం (famous eye hospital building) కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని గుర్తించారు. కాగితాల్లో ఒక విధంగా.. నిర్మాణంలో మరో విధంగా ఉన్నప్పటికీ అనుమతులు ఇచ్చారు. దీనిపైనా అధికారులు విచారణ జరిపారు. ఇదే బిల్డింగ్​కు సమీపంలో కొనసాగుతున్న ఓ ప్రైవేట్​ పాఠశాల భవనం (private school building) సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగింది. దీనికి సైతం కార్పొరేషన్​ అధికారులు నిబంధనలను పక్కన పెట్టి ట్యాక్స్​ అసెస్​మెంట్​ జారీ చేశారు.

మాలపల్లిలో ఓ కమర్షియల్​ బిల్డింగ్​, కేసీఆర్​ కాలనీలో ఓ వాణిజ్య సముదాయం, ఎల్లమ్మ గుట్టలో మరో బిల్డింగ్​కు సంబంధించిన దస్త్రాలను అధికారులు పరిశీలించారు. వీటి అనుమతుల జారీ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. 2023–25 మధ్య కాలంలో జారీ చేసిన భవనాల అనుమతుల ఫైల్స్​పై ఏసీబీ (ACB) లోతుగా విచారణ చేపట్టింది.

ఖిల్లా రోడ్డులోని రెండంతస్తులకు అనుమతి తీసుకొని ఐదు అంతస్తుల బిల్డింగ్​ నిర్మించారు. అప్పటి అధికారులు బల్డింగ్​ యజమానికి అన్ని విధాలా అండదండలు అందించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.