Cp Nizamabad | ఏటీఎం ధ్వంసం చేసేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​​

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cp Nizamabad | నగరంలో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి పోలీసులు రావడంతో పారిపోయిన ముఠా కేసును పోలీసులు పదిరోజుల్లోనే ఛేదించారు. దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) కేసు వివరాలను వెల్లడించారు. Cp Nizamabad | హరియాణాకు చెందిన ముఠా.. డిసెంబర్​ 31న రాత్రి గుర్తు ఐదుగురు వ్యక్తులతో కూడిన ముఠా పంజాబ్ నేషనల్ […]

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cp Nizamabad | నగరంలో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి పోలీసులు రావడంతో పారిపోయిన ముఠా కేసును పోలీసులు పదిరోజుల్లోనే ఛేదించారు. దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) కేసు వివరాలను వెల్లడించారు.

Cp Nizamabad | హరియాణాకు చెందిన ముఠా..

డిసెంబర్​ 31న రాత్రి గుర్తు ఐదుగురు వ్యక్తులతో కూడిన ముఠా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంను (Punjab National Bank ATM) గ్యాస్ కట్టర్​తో కాల్చి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు రాత్రి బ్లూకోల్ట్ విధులు నిర్వహించే పోలీసులను చూసి వారు పారిపోయారు. ఈమేరకు న్యాలకంటి లక్ష్మణ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసును విచారించారు. సీసీ టీవీ పుటేజీ (CCTV footage), సాంకేతిక ఆధారాలతో కేసును పరిశోధించారు. ఈ క్రమంలో నేరస్తుల గురించి గాలిస్తుండగా.. 8న మధ్యాహ్నం నిఖిల్ సాయి ఎక్స్​రోడ్​ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా.. బొలెరో వాహనంలో కర్రలు, రాళ్లు పెట్టుకొని వెళ్తున్న నేరస్తులను ఆపి విచారించగా నిందితులు పట్టుబడ్డారు.

Cp Nizamabad | హైదరాబాద్​ యువకుడితో దోస్తీ చేసి..

హరియాణాకు చెందినా అబ్డుల్లా తన గ్యాంగ్ సభ్యులైన ఆసిఫ్, అర్షద్, అజ్మీర్​తో 2018లో ఉదయ్​పూర్​లో ఏటీఎం కొల్లగొట్టి రూ.లక్షల్లో చోరీ చేశారు. అలాగే శివపురిలో ఏటీఎం ధ్వంసం చేసి అందులో నుంచి రూ.8 లక్షలు కొల్లగొట్టారు. ఈ కేసుల్లో వీరు జైలుకు వెళ్లారు. అయితే హైదరాబాద్​కు చెందినా అమీర్ ఇన్​స్టాలో మధ్యప్రదేశ్​కు చెందిన అమ్మాయితో పరిచయం కాగా.. ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆమె మైనర్​ అవడంతో పోక్సో కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని శివపురిలో జైలుకు తరలించారు. అక్కడ అబ్దుల్లా గ్యాంగ్​తో అమీర్​కు పరిచయమైంది. దీంతో అతడు తెలంగాణాలోనూ ఏటీఎంలను చోరీ చేసే ప్లాన్​ను వారికి వివరించాడు.

దీంతో అబ్దుల్లా గ్యాంగ్​ జైలునుంచి విడుదలైన తర్వాత అమీర్​తో కలిసి హైదరాబాద్​ వచ్చారు. ఏటీఎంలను కొల్లగొట్టేందుకు కావాల్సిన సిలిండర్, ఒక చిన్న ఎల్​పీజీ సిలిండర్, గ్యాస్ కట్టర్, గ్లౌస్​లు, నల్లటి రంగు స్ప్రే బాటిళ్లను కొనుగోలు చేశారు. జూలై 8న షాపూర్ నగర్ మార్కండేయ నగర్ రోడ్ పక్కన ఉన్న హెచ్​డీఎఫ్​సీ ఏటీఎంను కొల్లగొట్టారు. అందులో నుంచి రూ.30 లక్షల వరకు దొంగిలించి జీడిమెట్ల బస్​డిపో వద్ద గ్యాస్ కట్టర్ సామాగ్రి పడేశారు. అదే గల్లీలో రెండు బైక్​లు చోరీ చేసి కామారెడ్డికి వచ్చారు. అక్కడ బైక్​లు వదిలేసి ఆదిలాబాద్​ వెళ్లారు. అక్కడి నుంచి హరియాణా పారిపోయారు. ఆ కేసులో అమీర్, అబిద్, అర్షద్​లను పోలీస్ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అందులో అబ్దుల్లా దొరకలేదు.

Cp Nizamabad | బెయిల్​పై వచ్చిన తర్వాత..

తర్వాత అమీర్ బెయిల్​పై విడుదలయ్యాడు. అనంతరం ముఠా నాయకుడు అబ్దుల్లా మళ్లీ అమీర్​తో కలిసి అమీర్, వాజీబ్, అబీద్, ఇక్రామ్​లతో కొత్త గ్యాంగ్​ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి జహీరాబాద్​కు వస్తూ మార్గమధ్యలో టోల్​ప్లాజాకు కొద్ది దూరoలో ఒక కారు చోరీ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న ఏటీఎంను ధ్వంస చేసే ప్రయత్నం చేయగా.. పోలీసులు రావడంతో పారిపోయారు. అక్కడి నుంచి డిచ్​పల్లి చేరుకున్న చోరీముఠా అక్కడ భోజనం చేశారు.

గత నెల 31న రాత్రి నిజామాబాద్​ నగరానికి వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్​ ఏటీఎంను తెల్లవారుజామున కొల్లకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం అర్గుల్​ వద్ద ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమై అక్కడి నుంచి పారిపోయారు. మళ్లీ నిజామాబాద్​ నగరంలో ఏటీఎంలు ధ్వంసం చేసేందుకు రెక్కీ నిర్వహిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి నుంచి వాహనం గ్యాస్​ కట్టర్​, సిలిండర్​, కర్రలు, రాడ్లు, రాళ్లు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.