Homeక్రీడలుInd vs SA | భారత బ్యాట్స్​మెన్​ వైఫల్యం.. 201 పరుగులకే ఆలౌట్‌

Ind vs SA | భారత బ్యాట్స్​మెన్​ వైఫల్యం.. 201 పరుగులకే ఆలౌట్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్​లో భారత బ్యాటర్లు విఫలం అయ్యారు. దీంతో 201 పరుగులకే జట్టు ఆలౌట్​ అయింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ind vs SA | సౌత్​ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్​లోనూ భారత బ్యాట్స్​మెన్​ విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్​లో 201 పరుగులకే ఆలౌట్​ అయ్యారు.

తొలి టెస్ట్​లో భారత్​ ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​లో సైతం భారత టాప్​ ఆర్డర్​ విఫలం అయింది. తొలి ఇన్నింగ్స్​లో సౌత్​ ఆఫ్రికా (South Africa) 489 పరుగులు చేయగా.. భారత్​ 201 రన్స్​కు పరిమితమైంది.టాస్​ గెలిచి తొలుత బ్యాటింగ్​ ఎంచుకున్న సౌత్​ ఆఫ్రికా బ్యాటర్లు రాణించడంతో భారీ పరుగులు చేసింది. ముత్తుస్వామి సెంచరీతో రాణించగా మిగతావారు సైతం సత్తా చాటారు. మార్కో జాన్సన్​ 93 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్​కు శుభారంభం లభించింది. ఓపెనర్లు జైస్వాల్‌ 58, కేఎల్ రాహుల్​ 22 పరుగులు చేశారు. అయితే 65 పరుగుల వద్ద కేఎల్​ రాహుల్​ (KL Rahul), 95 పరుగుల వద్ద జైస్వాల్​ (Jaiswal) అవుట్​ అయ్యారు. అనంతరం భారత్​ కష్టాల్లో పడింది. మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్​ విఫలం అయ్యారు. సాయి సుదర్శన్​ 15, ద్రువ్​ జురేల్​ 0, కెప్టెన్​ పంత్​ 7, జడేజా 6, నితిష్​రెడ్డి 10 పరుగులు చేశారు.

Ind vs SA | సుందర్​ పోరాటం

మిడిలార్డర్​ వైఫల్యంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్​ను గట్టెక్కించడానికి వాషింగ్టన్​ సుందర్​ ఒంటరి పోరాటం చేశాడు. బౌలర్​ కుల్​దీప్​ యాదవ్​ (Kuldeep Yadav)తో కలిసి కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. సుందర్​ 48, కుల్​దీప్​ 19 పరుగులు చేశారు. కులదీప్​ యాదవ్ 134 బంతులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరు కలిసి 72 పరుగులు జోడించడంతో భారత్​ 201 పరుగులు చేయగలిగింది. లేదంటే 150 పరుగులోపే ఆలౌట్ అయి ఉండేది. ప్రత్యర్థి బౌలర్లలో జాన్సెన్‌ 6, సైమన్‌ 3 వికెట్లు తీశారు.