HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంది. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 2700 గ‌జాల స్థ‌లాన్ని కాపాడింది. దీని విలు రూ. 54 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipet) మండ‌లం నెక్నాంపూర్ గ్రామంలో 31వ స‌ర్వే నంబ‌రులో 59.14 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. స‌చివాల‌య ఉద్యోగులకు ప్ర‌భుత్వం 2002లో ఈ భూమిని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంది. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 2700 గ‌జాల స్థ‌లాన్ని కాపాడింది. దీని విలు రూ. 54 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది.

రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipet) మండ‌లం నెక్నాంపూర్ గ్రామంలో 31వ స‌ర్వే నంబ‌రులో 59.14 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. స‌చివాల‌య ఉద్యోగులకు ప్ర‌భుత్వం 2002లో ఈ భూమిని కేటాయించింది. 2007లో హుడా లే అవుట్​ కూడా వేశారు. లే అవుట్​లో 2700 గ‌జాల స్థలాన్ని పార్కుతో పాటు.. ప్ర‌జావ‌స‌రాల‌కు అప్ప‌ట్లో కేటాయించారు. గుట్ట‌లా ఉండే ఈ స్థలంలో పార్కు ఏర్పాటు చేయలేదు. దీనిని ఆసరాగా చేసుకున్నా కబ్జాదారులు ఆ భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించడానికి యత్నించారు.

HYDRAA land protection | అక్రమ నిర్మాణం

స‌చివాల‌య ఉద్యోగుల కాల‌నీకి ఆనుకుని స‌ర్వే నంబ‌రు 22లో వెంక‌టేశ్వర కాల‌నీ ఉంది. ఓ వ్యక్తి ఈ కాల‌నీలోని ప్లాట్‌ను చూపిస్తూ నిర్మాణ అనుమ‌తి తెచ్చుకున్నాడు. సదరు వ్యక్తులు అనుమతి తెచ్చుకున్న ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణం ఉంది. అయితే దానిని చూపించి స‌చివాల‌య ఉద్యోగుల కాల‌నీలోని పార్కుతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లంలో నిర్మాణాలు చేపట్టాడు. పునాదుల‌తో పాటు.. పిల్ల‌ర్లు వేసి.. స్లాబ్ వేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. పార్కు స్థలం కబ్జాపై కాల‌నీ సంక్షేమ సంఘం ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. ఈ మేరకు ఆక్రమణలను గురువారం తొలగించారు. అంతేగాకుండా గుట్ట‌ను ప్లాట్లుగా చేసి కొంత‌మంది అప్ప‌టి ప్ర‌తినిధులు అమ్మేసిన మ‌రో 5 ప్లాట్ల‌లో వేసిన తాత్కాలిక షెడ్డుల‌ను తొలగించారు. మొత్తం 2700 గ‌జాల మేర స్థ‌లం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.