Homeతాజావార్తలుGram Panchayat elections | మొదటి విడత ఎన్నికలు బోధన్ డివిజన్​లో

Gram Panchayat elections | మొదటి విడత ఎన్నికలు బోధన్ డివిజన్​లో

Gram Panchayat elections | గ్రామపంచాయతీ, వార్డు స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Gram Panchayat elections | గ్రామపంచాయతీ, వార్డు స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నిజామాబాద్​ జిల్లాలో బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లు ఉన్నాయి.

ఈ మూడు డివిజన్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 11వ తేదీన బోధన్, 14వ తేదీన నిజామాబాద్, 17వ తేదీన ఆర్మూర్ డివిజన్​లో పోలింగ్​ ఉంటుంది.

Gram Panchayat elections | డివిజన్​ల వారీగా..

బోధన్ డివిజన్లోని మొత్తం 11 మండలాల్లో 184 గ్రామపంచాయతీ, 1642 వార్డు స్థానాలకు ఉన్నాయి. వీటి కోసం డివిజన్​లో 1653 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు.

నిజామాబాద్ డివిజన్లో 8 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 196 గ్రామపంచాయతీలు, 1760 వార్డు స్థానాలు ఉండగా.. ఈ డివిజన్​లో 1760 పోలింగ్ స్టేషన్​లు ఏర్పాటు చేశారు.

ఆర్మూర్ డివిజన్​లో ఉన్న 12 మండలంలో 165 సర్పంచి, 1620 వార్డు స్థానాలు ఉన్నాయి. వీటి కోసం 1640 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు.