అక్షరటుడే, గాంధారి: Panchayat Elections | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల (Gandhari mandal) కేంద్ర సర్పంచి ఎన్నిక హాట్టాపిక్గా మారింది. ఇక్కడ మాజీ సర్పంచి మమ్మాయి సంజీవ్ తన సతీమణి రేణుకను సర్పంచి (Sarpanch) అభ్యర్థిగా బరిలో నిలిపారు.
Panchayat Elections | వాయిస్ కాల్స్ కలకలం రేపినప్పటికీ..
అయితే, మాజీ సర్పంచి అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ వాయిస్ కాల్స్ ట్రోల్ చేశారు కొందరు. మళ్లీ ఆయన సతీమణి గెలిస్తే ఆమె అండతో అవినీతి జరుగుతుందని కాల్స్లో పేర్కొన్నారు. గాంధారిలో ఈ కాల్స్ అంశం హాట్టాపిక్గా మారింది. ఈ అంశాన్ని ‘అక్షరటుడే’ కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఈ ఘటనతో మాజీ సర్పంచిపై ఓటర్లకు మరింత సానుభూతి పెరిగిందని తెలుస్తోంది.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి స్వతంత్ర అభ్యర్థి రేణుక ముందంజలో నిలిచారు. సమీప ప్రత్యర్థి ఆకుల కల్పన చంద్రశేఖర్కు 1,538 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్కు 3,653 ఓట్లు వచ్చాయి. దీంతో రెండు వేల పైచిలుకు మెజారిటీతో ఆమె భారీ విజయం సాధించారు.
